'సిద్ధం' సభ పేరిట భీమిలికి జగన్ రాక - కొనసాగుతున్న అరెస్టులు, నిర్బంధాలు - CM Jagan Bheemili Tour
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 1:22 PM IST
|Updated : Jan 27, 2024, 3:37 PM IST
House Arrests of TDP and Janasena Leaders : విశాఖ జిల్లా భీమిలిలో 'సిద్ధం' పేరిట వైఎస్సార్సీపీ శనివారం బహిరంగసభ నిర్వహిస్తొంది. ఈ సభకు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు పర్వం మొదలైంది. ఇప్పటికే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, జనజాగృతి సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ, విశాఖ భూదోపిడీల మీద వైఎస్సార్సీపీ పెద్దలను నిలదీసినందుకే తనని అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ విశాఖ వస్తే ప్రతిపక్షాలు బయటకు రాకుండా పోలీసు వలయాలు పెట్టడం దారుణమన్నారు. కొద్ది రోజుల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగిపోవడానికి 'సిద్ధం'గా ఉన్నరని విమర్శించారు.
జగన్ను గద్దె దించడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో 'యుద్ధం' ప్రకటించారని పీతల మూర్తి యాదవ్ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా ఉంది. ఈ ప్రాంతం నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలనుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. గతంలో టీడీపీ, జనసేనలు కలిసి భీమిలి – భోగాపురం మధ్యలో భారీ ఎత్తున బహిరంగ సభ జరిపి పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించిన నేపథ్యంలో వైసీపీ కూడా ఇక్కడే దృష్టిసారించి సభకు సిద్ధమైంది.