thumbnail

జగన్ ఇప్పుడు ఎమ్మెల్యే- ఇప్పుడైన వచ్చి కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పాలి: న్యాయవాది సలీం - Kodi Kathi Case latest updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 8:15 PM IST

Former CM Jagan Kodi Kathi Case: మాజీ ముఖ్యమంత్రి జగన్ కోడి కత్తి కేసు ప్రధాన నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఎన్​ఐఏ కోర్టుకు హాజరయ్యాడు. బెయిల్ అనంతరం ఇవాళ విశాఖ కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసులో తదుపరి విచారణను విశాఖ ఎన్​ఐఏ కోర్టు జులై 4వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కేసును ఎన్​ఐఏ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులకు బదిలీ చేయాలని కోరాడు. 

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంపై శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది సలీం ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ఇప్పుడు సాధారణ శాసనసభ్యుడు కావడంతో కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని అన్నారు. తనపై పెట్టిన కేసులతో తాను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నానని జనపల్లి శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కేసులను ఎదుర్కునే స్థోమత లేదని, సాయం తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు కోడికత్తి శ్రీను వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.