ఉగ్యోగులందరూ ప్రశాంతంగా ఊపరి తీసుకుకోవచ్చు: సూర్యనారాయణ - Suryanarayana on YSRCP GOVT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 9:59 PM IST

thumbnail
ఉగ్యోగులందరూ ఇక ప్రశాంతంగా ఊపరి తీసుకుకోవచ్చు: సూర్యనారాయణ (ETV Bharat)

Employees Union President Suryanarayana Allegations on YSRCP Govt: ఎగ్జిట్ పోల్స్‌తో రాష్ట్రంలో ఉగ్యోగులందరూ ఇక ప్రశాంతంగా ఊపరి తీసుకునే సమయం ఆసన్నమైందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ (AP Govt Employees Union President Suryanarayana) అన్నారు. నిత్యం అవమానాలతో కుంగిపోయిన ఉద్యోగుల మనస్సుకు తిరిగి పూర్వవైభవం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నానని ఇందుకు ప్రజాభిప్రాయంతో కూడిన ఎగ్జిట్ పోల్స్ (AP Election Exit Polls) ఆ సంకేతాలను ఇచ్చాయని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, ఫెన్షర్లకు తిరిగి పూర్వవైభవం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కోర్టు సీనియర్ సూపరిండెంట్, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు (APGEA District President Ramachandra Rao) పదవీ విరమణ కార్యక్రమానికి సూర్యనారాయణ హజరయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటం ఖాయమని పరోక్షంగా చెప్పారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఇకనుంచి అలాంటి సమస్య ఉండదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.