ప్రమాద స్థాయికి చేరుకున్న డుడుమ జలాశయ నీటిమట్టం - Duduma Reservoir at Dangerous Level

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 1:21 PM IST

thumbnail
ప్రమాద స్థాయికి చేరుకున్న డుడుమ జలాశయ నీటిమట్టం (ETV Bharat)

Duduma Reservoir Water Reached Dangerous Level Due to Heavy Rains : భారీ వర్షాల ధాటికి ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయం (డిడ్యాం) వద్ద నీటిమట్టం ఆదివారం ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. శనివారం నుంచి జలాశయంలో ఏడో నంబరు గేటు ద్వారా వెయ్యి క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ఆదివారం ఉదయం అదనంగా ఆరో నంబరు గేటు కూడా ఎత్తి మొత్తం రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీటి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిన తరువాత ప్రస్తుతం ఆరో నంబరు గేటు ద్వారా వెయ్యి క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం గరిష్ఠ నీటిమట్టం ప్రస్తుతం 2,590 అడుగులు కాగా ప్రస్తుతం 2589.2 అడుగులకు చేరుకుంది. నిన్న ఒక్క రోజే జోలాపుట్‌ జలాశయం పరివాహక ప్రాంతంలో 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రమాద స్థాయికి మించి నీరు చేరడంతో నాలుగువేల క్యూసెక్కుల నీటిని దిగువన గల బలిమేళకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.