LIVE: విజయవాడ పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో - ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
|Updated : 3 hours ago
Drone Show at Punnami Ghat Live : ఏపీని డ్రోన్ హబ్గా తీర్చిద్దటమే లక్ష్యంగా జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి సీకె కన్వెన్షన్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్లో 6929 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 53 స్టాల్స్లో డ్రోన్ల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏపీని డ్రోన్ హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో జరుగుతోంది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించారు. 8 వేల మంది డ్రోన్ షో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డ్రోన్ షో వీక్షించేలా విజయవాడలో నాలుగు చోట్ల డిస్ప్లేలు సైతం ఏర్పాటు చేశారు.
Last Updated : 3 hours ago