8వ రోజు డీఆర్డీఏ ఉద్యోగుల సమ్మె- పట్టించుకోని ప్రభుత్వం - ఒంగోలులో 8వ రోజు డీఆర్డీఏ సమ్మె
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 5:36 PM IST
DRDA Workers Strike In Prakasam District : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో 8వ రోజు డీఆర్డీఏ (DRDA) ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. జిల్లా జేఏసీ(JAC) ఉద్యోగుల ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 8 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం వేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉద్యోగులకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సెర్ఫ్ ఉద్యోగులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని, ఉద్యోగులకు కేడర్ ఫిక్స్ చేస్తూ, పే స్కేల్ అమలు చేస్తూ, సర్వీస్ రెగ్యులర్ చేయాలని కోరారు.