అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాం : మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి - Social Welfare Minister ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 1:31 PM IST

thumbnail
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాం : మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి (ETV Bharat)

Dola Sree Bala Veeranjaneya Swamy Charge As Minister Social Welfare : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయస్వామి బాధ్యతలు చేపట్టారు. ముందుగా సచివాలయంలో ప్రత్యేక పూజలు చేయగా వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సచివాలయం మూడో బ్లాక్‌లో సాంఘిక సంక్షేమ, సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై మంత్రి సంతకాలు చేశారు. మంత్రి డీబీవీకి సచివాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి అభినందించారు. సింగరాయకొండ అంబేడ్కర్ గురుకులంలో గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీట్లను పునరుద్ధరిస్తూ సంతకాలు చేసినట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఏళ్లైందని మంత్రి వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.