అయోధ్య బాల రాముడి కోసం కిలో బంగారం, 13 కిలోల వెండితో ధనుర్బాణం - చూసి మీరూ తరించండి - Ayodhya Rams Dhanurbanas - AYODHYA RAMS DHANURBANAS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 8:55 PM IST

Ayodhya Rams Dhanurbanas To Shadnagar : అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించబోతున్న శ్రీరామ చంద్రుడి చేతిలో ఉండాల్సిన ధనుర్బాణాలు గురువారం షాద్‌నగర్‌ ఆలయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్​కు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి అనే వ్యక్తి అయోధ్య బాల రాముని మందిరం పైన నిర్మించే శ్రీరాముని విగ్రహానికి ధనస్సు బాణం ఇవ్వాలని సంకల్పించుకున్నారు. దీనికోసం 13 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో హైదరాబాద్​లో ధనుస్సు బాణం తయారు చేయించారు. మందిరం పూర్తి కావడానికి సమయం ఉండటంతో తాను తయారు చేయించిన ధనస్సును భక్తుల సందర్శనార్థం ప్రముఖ ఆలయాల్లో ప్రదర్శన నిమిత్తం తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.

దీంట్లో భాగంగా గురువారం షాద్​నగర్ పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి శ్రీరామచంద్రుని ధనుర్భాణాలు తీసుకువచ్చారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు రంగనాథ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. షాద్​నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని పలు ప్రాంతాలకు వీటిని భక్తుల సందర్శనార్థం తీసుకెళ్తున్నట్లు శ్రీనివాసశాస్త్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.