మందుబాబులూ పారాహుషార్!- చూసుకోకుండా తాగితే ఎవ్వరూ కాపాడలేరు - బ్లూకలర్ బీర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2024/640-480-20681517-thumbnail-16x9-contaminated-beer-in-jagannadhapuram.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 5:59 PM IST
Contaminated Beer in jagannadhapuram: రాష్ట్రంలో మందుబాబులు మద్యం ముట్టుకోవాలంటేనే ఆలోచించాల్సిన ఘటన ఇది. తాగుదామని తీసుకున్న బీరు గ్లాసులో పోసి గమనించకుండా తాగారో మీ పని అంతే అనేలా ఉంది ఈ సీన్. బీరు కాలం చెల్లి ఎదో కొంచెం రంగు మారింది అనుకుంటే అది వేరు. కానీ, ఇక్కడ అసలు సీసాలో వచ్చింది మద్యమేనా ఇంకేమైనా కలిపారా అని అనుమానం కలిగేలా సిరా రంగులో వచ్చింది.
కాకినాడ జిల్లాలోని జగన్నాథపురంలోని ఓ వ్యక్తి ప్రభుత్వ మద్యం దుకాణంలో రెండు బీర్లు తీసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేసి, గ్లాసులో పోసుకుని తాగడానికి నోటి దగ్గర పెట్టుకున్నాడు. అంతలోనే అతడి భార్య బీరు రంగుమారి ఉండడాన్ని గమనించింది. వెంటనే గ్లాసును పక్కకు నెట్టివేయడంతో రంగు మారిన బీరును సదరు వ్యక్తి గమనించాడు. ఇదే విషయమై బీరు తీసుకున్న మద్యం దుకాణాన్ని ప్రశ్నించగా, తమకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. బీరు తయారు చేసిన ప్యాక్టరీ వద్ద ఫిర్యాదు చేసుకోమ్మని చెప్పారని బీరు కొనుగోలు చేసిన వ్యక్తి వాపోయాడు. ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆ వ్యక్తి ఆరోపించాడు. నకిలీ మద్యం వల్ల తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.