ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్​ అడ్డుపడుతున్నారు: మంద కృష్ణ మాదిగ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 3:10 PM IST

thumbnail

Manda Krishna Madiga Accused CM Jagan of Obstructing SC Classification : ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం జగన్​ అడ్డు పడుతున్నారని ఎమ్మార్సీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం (ఫిబ్రవరి 26) కావలిలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎమ్మార్పీయస్​ సమావేశంలో మంద కృష్ణ పాల్గొన్నారు. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వైఎస్సార్సీపీకి మాదిగ సోదరులంతా దూరంగా మెలగాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్​ను ఇంటికి పంపించడానికి మాదిగ సోదరులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

జగన్​ తన ఆర్థిక నేరాలకు న్యాయవాదులను నియమించుకుంటారని, వర్గీకరణకు మాత్రం రాష్ట్రం తరపున సుప్రీంకోర్టులో న్యాయవాదిని నియమించలేదని మంద కృష్ణ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన పార్టీలకు అనుకూలంగా ఉంటామని, ప్రతికూలంగా ఉన్న వారికి వ్యతిరేకంగా ఉంటామని వ్యాఖ్యానించారు. మార్చి 9న వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో చలో అమరావతికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.