'అయ్యో చిట్టి తల్లీ!' చిన్నారికి ప్రాణాంతక వ్యాధి- రూ.16 కోట్ల ఇంజక్షన్ చేయించాలంటున్న వైద్యులు - child suffering with rare disease - CHILD SUFFERING WITH RARE DISEASE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 1:51 PM IST
Child Suffering With Rare Disease Needs Help: తొమ్మిది నెలల కిందట మహాలక్ష్మి తమ ఇంట పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంబరపడ్డారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన ఆ దంపతులు ఆ పసిపాపే లోకంగా జీవిస్తూ అల్లారు ముద్దుగా పెంచారు. నెలలు గడుస్తున్నా అందరి చిన్నారుల మాదిరి బోర్లాపడటం, పాకడం లాంటివి చేయకపోవడంతో ఆందోళన చెందారు. భయంతో వెంటనే వైద్యుల్ని సంప్రదించారు. అనేక పరీక్షలు అనంతరం చిట్టితల్లి హితైషికి ప్రాణాంతక స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే అరుదైన వ్యాధి ఉందని తెలిసింది.
బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా కలియతిరగాల్సిన ఆ చిన్నారిని ప్రాణాంతక వ్యాధి చిదిమేస్తోంది. స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న హితైషిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాప ప్రాణాలు కాపాడుకునేందుకు రూ.16 కోట్ల రూపాయల ఖరీదైన ఇంజక్షన్ చేయించాలని తెలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ ఆస్తులన్నీ అమ్మినా చిన్నారి వైద్య ఖర్చులకు సరిపోవని చెప్తున్నారు. దాతలు, ప్రభుత్వం సహకరించకుంటే తమ కుమార్తెను దక్కించుకోలేమని వాపోతున్న గుంటూరుకు చెందిన గాయత్రి, ప్రీతమ్ దంపతులతో ముఖాముఖి.