పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేశారు - సీఈవోకు సీఎఫ్డీ ఫిర్యాదు - CFD Complaint on Pensions Delay - CFD COMPLAINT ON PENSIONS DELAY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-04-2024/640-480-21162766-thumbnail-16x9-cfd-complaint-on-pensions-distribution-delay.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 7:37 PM IST
CFD Complaint on Pensions Distribution Delay: పెన్షన్ పంపిణీ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో పెన్షన్పై జీవిస్తున్న 62 లక్షల మంది లబ్దిదారుల్ని ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నించారని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిందని అయితే దాన్ని కొందరు దురుద్దేశ పూర్వకంగా వక్రీకరించారని పేర్కోన్నారు.
అయితే వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ చేయించేలా చూడాలని కొందరు హైకోర్టులోనూ పిల్ వేశారని వారి వాదనపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసిందని అన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీని కావాలనే కొందరు ఆలస్యం చేశారని ఆయన పేర్కొన్నారు. నిధుల కొరత లేకపోయినా పంపిణీ ఆలస్యం చేసేందుకు కొందరు ప్రయత్నం చేశారన్నారు. ఆలస్యానికి కారకులు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరినట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నందున మొదటి తేదీనే పెన్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఈఓకి విజ్ఞప్తి చేశామన్నారు.