'బెదిరించి భూములు లాక్కున్నారు'- మాజీ ఎంపీ ఎంవీవీపై కేసు - CASE FILED ON MVV - CASE FILED ON MVV
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 3:49 PM IST
Case Filed On Vishaka Ex MP MVV Satyanarayana : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హయగ్రీవ కన్స్ట్రక్షన్స్ అధినేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ ఎంవీవీ ఆయన ఎడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు సహా రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
హయగ్రీవ భూముల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకొని విలువైన భూములు కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హయగ్రీవ భూముల వ్యవహారంలో తనను బెదిరించి సంతకాలు సేకరించారు అని జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 120, 420, 34 ఐపీసీలతో సహా పలు సెక్షన్ల పై 10కి పైగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ హై కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అధికారం చేతిలో పెట్టుకుని ఈ భూ దందా చేశారని, హయగ్రివా భూముల మీద హై కోర్ట్లో పోరాడుతున్న జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు.