రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టిన కారు - అక్కడికక్కడే ఇద్దరు మృతి - Car Accident
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-03-2024/640-480-20886674-thumbnail-16x9-car-acci.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 2, 2024, 1:03 PM IST
Car Accident In Suryapet : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణాంగా ఏకంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. కారు అదుపు తప్పి ఇంటి పిల్లర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తిరుమలగిరి పాత ఊరు సమీపంలోకి రాగానే, జనగామ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిని బలంగా ఢీ కొట్టింది. కారులో నలుగురు ఉండగా ప్రమాద సమయంలో విక్రమ్, రమేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Suryapet Car Accident : క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారంతా కరీంనగర్ నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్తున్నారు. మృతులు కరీంనగర్ కచ్చిరెడ్డి పల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.