రిపబ్లిక్​ డే రోజు ఆటో డ్రైవర్​ విన్నూత ప్రయత్నం - ప్రయాణికుల వద్ద ఒక్క రూపాయి ఛార్జ్ - One Rupee Charge Auto

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 9:01 PM IST

Auto Driver Charge One Rupee for Republic Day : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆటో డ్రైవర్​ తన వాహనంపై జాతీయ జెండా రూపంలో మూడు రంగుల వరి నారు అమర్చి, ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి ఛార్జీ మాత్రమే తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఈదులపూసపల్లి దర్గా తండాకు చెందిన అంజీ నాయక్​ వృత్తిరీత్యా రైతు, ఆటోడ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన ఆటో మీద జాతీయ జెండా తరహాలో వరి నారు అమర్చి, ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి ఛార్జీ మాత్రమే తీసుకున్నాడు. 

One Rupee Charge Auto in Mahabubabad : అంతేకాకుండా అంజీ నాయక్​ తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికులతో భారత్​ మాతాకీ జై అంటూ నినాదాలు చేయించాడు. గత పదిహేను సంవత్సరాలుగా ఖాళీ సమయంలో ఆటో నడిపిస్తున్నానని తెలిపాడు. అంజీ నాయక్ ప్రయత్నం బాగుందని పట్టణవాసులు మెచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.