చంద్రబాబు బెయిల్​ను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం - చంద్రబాబు బెయిల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 7:34 PM IST

AP Govt Approached Supreme on Challenges Chandrababu Bail: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ సవాల్ చేసింది. ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్​​ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్​లో పేర్కొంది. ఈ పిటిషన్​పై ఈ నెల 29వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 10న చంద్రబాబుకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం కేసుల్లో హైకోర్టు ఒకేసారి బెయిల్ మంజూరు చేసింది. 

చంద్రబాబు రింగ్​ రోడ్డు కేసు: 2014 నుంచి 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రభుత్వ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్​మెంట్​ను ఇష్టానుసారం మార్చారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రింగ్ రోడ్డు అలైన్​మెంట్​లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, హెరిటేజ్ సంస్థ తదితరులను నిందితులుగా పేర్కొంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.