thumbnail

Live: అమరావతి డ్రోన్ సమ్మిట్​ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 53 minutes ago

Amaravati Drone Summit 2024 Live : ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యంగా జాతీయస్థాయి డ్రోన్‌ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తున్నారు.  కేంద్ర పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , సీఐఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి వరకూ 6929 మంది నమోదు చేసుకున్నారు. డెలిగేట్స్, డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్ , స్పీకర్స్ విభాగాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు. సమ్మిట్‌లో మొత్తం 9 అంశాల్లో సెషన్లు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతో పాటు డ్రోన్ హ్యాకథాన్‌ను నిర్వహిస్తారు. నాలుగు విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి  24 లక్షల రూపాయల బహుమతుల్ని ప్రదానం చేయనున్నారు. డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది. 
Last Updated : 53 minutes ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.