LIVE : నరసరావుపేటలో పింఛన్లు పంపీణీ చేస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU DISTRIBUTING PENSIONS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-12-2024/640-480-23226050-thumbnail-16x9-cm-chandrababu-naidu-distributing-ntr-pensions-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2024, 12:05 PM IST
|Updated : Dec 31, 2024, 2:43 PM IST
CM Chandrababu Naidu Distributing NTR Pensions Live : రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో, ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి, బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు.2021లో కరోనాతో భర్తను కోల్పోయిన తలారి శారమ్మకు వితంతు పింఛన్, ఏడు కొండలకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందించారురు. వారి ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ తర్వాత గ్రామంలోని కోదండరామస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండ వెళ్లిత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి గుంటూరు జిల్లా ఉండవల్లి చేరుకుంటారు. సీఎం పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగోసారి సీఎంగా తొలిసారి పల్నాడు జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు.నరసరావుపేటలో పింఛన్లు పంపీణీ చేస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Dec 31, 2024, 2:43 PM IST