మద్యం మత్తులో బీరు సీసా పగులగొట్టి గాజు పెంకులు మింగేశాడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 12:47 PM IST

thumbnail

Alcoholic Suicide Attempt : తాగుడుకు బానిసైన అతడు మతి స్థిమితం కోల్పోయి బీరు సీసాను పగల గొట్టి గాజు పెంకులు మింగాడు. చివరికి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి గాజు పెంకులు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.

గుత్తి పట్టణం చెర్లోపల్లి కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆది మద్యం మత్తులో బీరు సీసాను పగల గొట్టి గాజు పెంకులు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు బంధువులు తెలిపారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆదిని గమనించిన స్థానిక ప్రజలు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిని జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.