ETV Bharat / technology

విజయవంతంగా అగ్ని-4 మిస్సైల్ ప్రయోగించిన భారత్ - AGNI 4 BALLISTIC MISSILE

author img

By ETV Bharat Tech Team

Published : Sep 7, 2024, 4:12 PM IST

India successfully launches Agni4 Ballistic Missile: దేశీయంగా రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ క్షేత్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

India_Successfully_Launches_Agni4_Ballistic_Missile
India_Successfully_Launches_Agni4_Ballistic_Missile (ANI)

India Successfully Launches Agni4 Ballistic Missile: డీఆర్​డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్​లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష సక్సెస్ కావడంతో ఈ మిస్సైల్​లోని సాంకేతిక వ్యవస్థలు, నిర్వాహక వ్యవస్థలు సరిగ్గానే పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మన దేశానికి చెందిన న్యూక్లియక్ కమాండ్ అథారిటీ (ఎన్​సీఏ) పరిధిలోని స్ట్రాటజిక్ ఫోర్సెస్​ కమాండ్ (SFC) ​ఆధ్వర్యంలో ఈ ప్రయోగ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని సాంకేతిక లక్ష్యాలు నెరవేరాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-4తో లక్ష్య పరిధి మరింత పెరిగింది. దాదాపు 4వేల కిలో మీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఇది చేధించగలదు. 20 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణికి వెయ్యి కేజీల పేలోడ్​(మందుగొండు సామాను)ను మోసుకుని వెళ్లగల సామర్థ్యం ఉంది. భారీ ట్రక్కులలో దీన్ని తరలించి, ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అనువుగా ఈ మిస్సైల్ నిర్మాణం ఉంది. అంటే నేల మీద తిరగగలిగే లాంచర్‌ ద్వారా దీన్ని ప్రయోగించవచ్చు.

"ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దీన్నిసెప్టెంబర్ 6, 2024న ఒడిశాలోని చాందీపూర్ క్షేత్రం నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని సాంకేతిక లక్ష్యాలు నెరవేరాయి." - రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు

2012లో తొలిసారిగా ఈ అగ్ని-4 మిస్సైల్​ను ప్రయోగించారు. ఆ సమయంలో అది 20 నిమిషాల్లో 3వేల కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో అగ్ని-4 క్షిపణిని అగ్ని-2 ప్రైమ్​ అని కూడా పిలిచేవారు. దాన్ని వృద్ధి చేసి ప్రస్తుతం ప్రయోగించారు. అగ్ని మిసైల్స్​ను మన దేశానికి చెందిన డీఆర్​డీవో రూపొందించింది. ఈ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సాంకేతిక, నిర్వహణపర లక్ష్యాలను అందుకుందని అధికారులు తెలిపారు.

భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని గుర్తించిన నాసా- 6 దశాబ్దాల్లోని అతిపెద్ద ఆవిష్కరణల్లో ఒకటిగా రికార్డ్! - Global Electric Field on Earth

బెంగళూరు ఎగ్జిబిషన్​లో ఫస్ట్ వరల్డ్ వార్ వెపన్స్- సీవీ రామన్ తబలా కూడా- ఇంకా ఏం ప్రదర్శించారంటే? - Science Exhibition in Bangalore

India Successfully Launches Agni4 Ballistic Missile: డీఆర్​డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్​లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష సక్సెస్ కావడంతో ఈ మిస్సైల్​లోని సాంకేతిక వ్యవస్థలు, నిర్వాహక వ్యవస్థలు సరిగ్గానే పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మన దేశానికి చెందిన న్యూక్లియక్ కమాండ్ అథారిటీ (ఎన్​సీఏ) పరిధిలోని స్ట్రాటజిక్ ఫోర్సెస్​ కమాండ్ (SFC) ​ఆధ్వర్యంలో ఈ ప్రయోగ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని సాంకేతిక లక్ష్యాలు నెరవేరాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-4తో లక్ష్య పరిధి మరింత పెరిగింది. దాదాపు 4వేల కిలో మీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఇది చేధించగలదు. 20 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణికి వెయ్యి కేజీల పేలోడ్​(మందుగొండు సామాను)ను మోసుకుని వెళ్లగల సామర్థ్యం ఉంది. భారీ ట్రక్కులలో దీన్ని తరలించి, ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అనువుగా ఈ మిస్సైల్ నిర్మాణం ఉంది. అంటే నేల మీద తిరగగలిగే లాంచర్‌ ద్వారా దీన్ని ప్రయోగించవచ్చు.

"ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దీన్నిసెప్టెంబర్ 6, 2024న ఒడిశాలోని చాందీపూర్ క్షేత్రం నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని సాంకేతిక లక్ష్యాలు నెరవేరాయి." - రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు

2012లో తొలిసారిగా ఈ అగ్ని-4 మిస్సైల్​ను ప్రయోగించారు. ఆ సమయంలో అది 20 నిమిషాల్లో 3వేల కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో అగ్ని-4 క్షిపణిని అగ్ని-2 ప్రైమ్​ అని కూడా పిలిచేవారు. దాన్ని వృద్ధి చేసి ప్రస్తుతం ప్రయోగించారు. అగ్ని మిసైల్స్​ను మన దేశానికి చెందిన డీఆర్​డీవో రూపొందించింది. ఈ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సాంకేతిక, నిర్వహణపర లక్ష్యాలను అందుకుందని అధికారులు తెలిపారు.

భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని గుర్తించిన నాసా- 6 దశాబ్దాల్లోని అతిపెద్ద ఆవిష్కరణల్లో ఒకటిగా రికార్డ్! - Global Electric Field on Earth

బెంగళూరు ఎగ్జిబిషన్​లో ఫస్ట్ వరల్డ్ వార్ వెపన్స్- సీవీ రామన్ తబలా కూడా- ఇంకా ఏం ప్రదర్శించారంటే? - Science Exhibition in Bangalore

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.