ETV Bharat / state

విచ్చలవిడిగా మద్యం, బిర్యాని- ప్రేక్షక పాత్రకు పరిమితమైన పోలీసులు! - jagan Siddam Sabha

YSRCP leaders distributes liquor and biryani: అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో మద్యం ఏరులై పారింది. సభకు వచ్చిన జనానికి వైఎస్సార్సీపీ నేతలు మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టారు. సభ పరిసరాల్లో సరిపడ టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో జనం ఎండలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభకు అరకిలోమీటరు దూరంలో ఉన్న దుకాణాలను మూసేయించడంతో చిన్న వ్యాపారులు లబోదిబో మన్నారు.

YSRCP leaders distributes liquor and  biryani
YSRCP leaders distributes liquor and biryani
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 6:19 PM IST

YSRCP leaders distributes liquor and biryani: అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభ వద్ద మందుబాబులు హల్చల్ చేశారు. సభ సమీపంలోనే మందుబాబులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ హంగామా చేశారు. మందుబాబులు కూర్చున్న వద్ద నుంచి పోలీసులు అటు ఇటు తిరుగుతున్న కనీసం వారిని హెచ్చరించిన పాపాన పోలేదు. చేతిలో వైఎస్సార్సీపీ జెండాలు తలపై టోపీలు పెట్టుకొని మద్యం సేవిస్తూ కనిపించారు. అటుగా వెళుతున్న మహిళలు అభద్రతకు గురయ్యారు. వైఎస్సార్సీపీ సిద్ధం సభ ఏమో కానీ ఇలాంటి సభల ద్వారా తీవ్రమైన ఎండలకు మద్యం సేవించి వ్యక్తుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ ఆఫర్: మరోవైపు సభకు వచ్చే జనానికి పంచిన డబ్బు, మళ్లీ ప్రభుత్వ ఖజానాకు చేరేలా పక్కా ప్లాన్ చేసేశారు వైసీపీ నేతలు. కదిరి నియోజకవర్గంలో మద్యం దుకాణం వద్దనే నోట్ల కట్ట పట్టుకొని మనిషికి రూ.500 చొప్పున పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ తీసుకున్న రూ.500 అక్కడే జగనన్న మద్యం దుకాణంలో తప్పనిసరిగా మద్యం కొనుగోలు చేయాలి. మద్యం కొనుగోలు చేసిన వారికి ఉడికించిన కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న వారంతా సిద్ధం సభకు బస్సు ఎక్కాల్సిందే. ఈ ప్యాకేజీని పర్యవేక్షణ చేయటానికి వైఎస్సార్సీపీ నాయకులు గట్టి చర్యలు తీసుకుని జనాల్ని బస్సులు ఎక్కించారు. ఇంకేముంది అందరూ చేతిలో మద్యం బాటిల్ పట్టుకొని బస్సు ఎక్కటం, నడిచే బస్సులోనే మద్యం తాగుతూ, జగన్ కు జేజేలు పలికారు.

సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు- ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం

సీఎం రాకకోసం ఎండలో పడిగాపులు: సభకు లక్షల మంది వస్తున్నారంటూ ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డికి మాత్రం చల్లని నీడ, ఏసీలతో చల్లదనం ఏర్పాటు చేసి, వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన జానాన్ని ఎండకు ఎండిపోయేలా ఏర్పాట్లు చేశారు. జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు వస్తుండగా, 12 గంటల నుంచే పోలీసులు జనాన్ని రోడ్లపైన ఉండకుండా గ్యాలరీల్లోకి పంపారు. గ్యాలరీల్లో ఎండకు మండిపోతున్న కుర్చీల్లో కూర్చుంటున్న జనానికి జగన్ మోహన్ రెడ్డి మద్యం విందుతో పాటు మాడిపోయే ఆఫర్ ఇచ్చారు.

భోజనం ప్యాకెట్ల కోసం ఎగబడ్డ పోలీసులు: సిద్ధం సభకు బందోబస్తుగా వచ్చిన పోలీసుల సంఖ్యకు సరిపడా భోజనం ప్యాకెట్లు అధికారులు సరఫరా చేయలేకపోయారు. దీంతో భోజనం పంపిణీ చేసే వాహనం సభ సమీపంలోకి రాగేనే పోలీసులు వాహనంపై ఎగబడి భోజనం ప్యాకెట్లు లాక్కునే పరిస్థితి తలెత్తింది. కార్యకర్తల సభ అంటూ ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, ఆశావర్కర్లకు వైఎస్సార్సీపీ టోపీలు పెట్టి సభకు తీసుకొచ్చారు. సభ ప్రాంగణం ప్రవేశమార్గంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీ నేతల ఫోటోలు పెట్టించారు. సభకు వచ్చిన జనంతో ఈ ఫోటోలను కాళ్లతో, చేతులతో కొట్టించటానికి వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు.


జగనన్న ఇళ్ల స్థలాలపై వైసీపీ డేగల కన్ను- పేదరికాన్ని సొమ్ము చేసుకుంటున్న దళారులు

సిద్ధం సభ కోసం మద్యం, బిర్యాని పంపిణీ - చెట్ల కింద సేద తీరిన మందుబాబులు

YSRCP leaders distributes liquor and biryani: అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభ వద్ద మందుబాబులు హల్చల్ చేశారు. సభ సమీపంలోనే మందుబాబులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ హంగామా చేశారు. మందుబాబులు కూర్చున్న వద్ద నుంచి పోలీసులు అటు ఇటు తిరుగుతున్న కనీసం వారిని హెచ్చరించిన పాపాన పోలేదు. చేతిలో వైఎస్సార్సీపీ జెండాలు తలపై టోపీలు పెట్టుకొని మద్యం సేవిస్తూ కనిపించారు. అటుగా వెళుతున్న మహిళలు అభద్రతకు గురయ్యారు. వైఎస్సార్సీపీ సిద్ధం సభ ఏమో కానీ ఇలాంటి సభల ద్వారా తీవ్రమైన ఎండలకు మద్యం సేవించి వ్యక్తుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ ఆఫర్: మరోవైపు సభకు వచ్చే జనానికి పంచిన డబ్బు, మళ్లీ ప్రభుత్వ ఖజానాకు చేరేలా పక్కా ప్లాన్ చేసేశారు వైసీపీ నేతలు. కదిరి నియోజకవర్గంలో మద్యం దుకాణం వద్దనే నోట్ల కట్ట పట్టుకొని మనిషికి రూ.500 చొప్పున పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ తీసుకున్న రూ.500 అక్కడే జగనన్న మద్యం దుకాణంలో తప్పనిసరిగా మద్యం కొనుగోలు చేయాలి. మద్యం కొనుగోలు చేసిన వారికి ఉడికించిన కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న వారంతా సిద్ధం సభకు బస్సు ఎక్కాల్సిందే. ఈ ప్యాకేజీని పర్యవేక్షణ చేయటానికి వైఎస్సార్సీపీ నాయకులు గట్టి చర్యలు తీసుకుని జనాల్ని బస్సులు ఎక్కించారు. ఇంకేముంది అందరూ చేతిలో మద్యం బాటిల్ పట్టుకొని బస్సు ఎక్కటం, నడిచే బస్సులోనే మద్యం తాగుతూ, జగన్ కు జేజేలు పలికారు.

సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు- ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం

సీఎం రాకకోసం ఎండలో పడిగాపులు: సభకు లక్షల మంది వస్తున్నారంటూ ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డికి మాత్రం చల్లని నీడ, ఏసీలతో చల్లదనం ఏర్పాటు చేసి, వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన జానాన్ని ఎండకు ఎండిపోయేలా ఏర్పాట్లు చేశారు. జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు వస్తుండగా, 12 గంటల నుంచే పోలీసులు జనాన్ని రోడ్లపైన ఉండకుండా గ్యాలరీల్లోకి పంపారు. గ్యాలరీల్లో ఎండకు మండిపోతున్న కుర్చీల్లో కూర్చుంటున్న జనానికి జగన్ మోహన్ రెడ్డి మద్యం విందుతో పాటు మాడిపోయే ఆఫర్ ఇచ్చారు.

భోజనం ప్యాకెట్ల కోసం ఎగబడ్డ పోలీసులు: సిద్ధం సభకు బందోబస్తుగా వచ్చిన పోలీసుల సంఖ్యకు సరిపడా భోజనం ప్యాకెట్లు అధికారులు సరఫరా చేయలేకపోయారు. దీంతో భోజనం పంపిణీ చేసే వాహనం సభ సమీపంలోకి రాగేనే పోలీసులు వాహనంపై ఎగబడి భోజనం ప్యాకెట్లు లాక్కునే పరిస్థితి తలెత్తింది. కార్యకర్తల సభ అంటూ ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, ఆశావర్కర్లకు వైఎస్సార్సీపీ టోపీలు పెట్టి సభకు తీసుకొచ్చారు. సభ ప్రాంగణం ప్రవేశమార్గంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీ నేతల ఫోటోలు పెట్టించారు. సభకు వచ్చిన జనంతో ఈ ఫోటోలను కాళ్లతో, చేతులతో కొట్టించటానికి వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు.


జగనన్న ఇళ్ల స్థలాలపై వైసీపీ డేగల కన్ను- పేదరికాన్ని సొమ్ము చేసుకుంటున్న దళారులు

సిద్ధం సభ కోసం మద్యం, బిర్యాని పంపిణీ - చెట్ల కింద సేద తీరిన మందుబాబులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.