ETV Bharat / state

సినీనటిపై వేధింపులు అప్డేట్ - ముంబయిలో కేసు క్లోజ్ కోసం బెజవాడలో సెటిల్‌మెంట్‌ - YSRCP Leaders Harassed Actress

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 7:05 AM IST

YSRCP Leaders Harassed To Mumbai Actress : ముంబయికి చెందిన సినీనటిని జగన్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్‌లు కలిసి వేధించిన వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. జేఎస్​డబ్ల్యూ సంస్థ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌పై ముంబయిలో ఆమె అత్యాచారం కేసు పెట్టింది. దీనిని గుట్టుగా సెటిల్‌ చేసేందుకే సినీనటి కుటుంబ సభ్యులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జైలులో బెదిరించి చెప్పిన వాటికల్లా అంగీకరించిన తర్వాత పోలీసులే వారిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చి ముంబయి వెళ్లేందుకు అనుమతిచ్చారని ఆరోపణలున్నాయి.

YSRCP Leaders Harassed Actress
YSRCP Leaders Harassed Actress (ETV Bharat)

Mumbai Actress Torture Case in AP : ముంబయికి చెందిన సినీనటిపై వైఎస్సార్సీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. సజ్జన్ జిందాల్‌పై ముంబయిలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకే ఆమెపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జన్‌ జిందాల్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబయిలోని బాంద్ర-కుర్ల కాంప్లెక్స్‌ పోలీస్​స్టేషన్‌లో సినీనటి కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సజ్జన్‌ జిందాల్‌పై కేసు : బాంబే హైకోర్టు ఆదేశాలతో గతేడాది డిసెంబర్‌లో సజ్జన్‌ జిందాల్‌పై అత్యాచారంతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు ముంబయిలో సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలోనే విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరిలో సినీనటితో పాటు ఆమె తల్లీదండ్రులపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

YSRCP Leaders Torcher To Mumbai Heroin : ఆ వెంటనే ఆగమేఘాలపైన నాటి డీసీపీ విశాల్‌ గున్నీ, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతురావు, సీఐ శ్రీధర్, ఎస్సై షరిఫ్‌ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబయి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తీసుకురావటం శరవేగంగా జరిగిపోయాయి. మార్చి 15 వరకు సినీనటి, ఆమె తల్లీదండ్రులు విజయవాడ జైల్లోనే ఉన్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు.

YSRCP Leader kukkala Vidya Sagar Issue : ఈ క్రమంలో తాము చెప్పినవాటికల్లా అంగీకరిస్తే బెయిల్‌ వచ్చేలా చేస్తామని లేదంటే నెలల తరబడి జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుందని వారిని నాటి పోలీసు అధికారులు బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఖాకీలే వారికి బెయిల్‌ ఇప్పించి విడుదలయ్యేలా చేశారు. అనంతరం వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆ తర్వాత ముంబయికి వెళ్లిపోయింది.

క్లోజర్‌ రిపోర్ట్ దాఖలు చేసిన పోలీసులు : విజయవాడ జైలు నుంచి సినీనటి కుటుంబం విడుదలైన రెండు రోజులకే బాంద్ర-కుర్ల కాంప్లెక్స్‌ పోలీస్​స్టేషన్‌లో సజ్జన్‌ జిందాల్‌పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. ఆ మేరకు అక్కడి న్యాయస్థానంలో క్లోజర్‌ రిపోర్ట్ దాఖలు చేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలు బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలమివ్వటానికి రావాలని పదే పదే కోరినా రాలేదని పేర్కొంటూ కేసును మూసివేశారు.

జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌కు నాటి ముఖ్యమంత్రి జగన్‌తో సత్సంబంధాలున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో జేఎస్‌డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కూడా చేసింది. ఈ క్రమంలోనే ముంబయిలో సజ్జన్‌ జిందాల్‌పై నమోదైన అత్యాచారం కేసులో ఆయనకు మరిన్ని చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. వారి పట్ల విపరీతమైన స్వామిభక్తి ప్రదర్శించే, వారి అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే నాటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటాకు ముంబయి వివాదం సెటిల్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించారు.

వ్యవహారం చక్కబెట్టిన కాంతిరాణా : రంగంలోకి దిగిన నాటి సీపీ కాంతిరాణా టాటా అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం వ్యవహారం చక్కబెట్టారు. చిన్న జేబుదొంగను పట్టుకున్నా సరే ప్రెస్‌మీట్‌లు పెట్టి, ప్రెస్‌నోట్‌లు విడుదల చేసి హడావుడి చేసేవారు. కానీ ఆయన అత్యంత ప్రాధాన్యతతో కూడిన సినీనటి కేసు వ్యవహారంలో ఎక్కడా చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. అసలు ఆమెను, ఆమె కుటుంబీకుల్ని అరెస్ట్ చేసిన విషయాన్ని ఏ మార్గంలోనూ బహిర్గతం కాకుండా చూశారు. ఆద్యంతం గుట్టుగా సాగిన ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వెలుగుచూసింది.

ముంబయి నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చుట్టు ఉచ్చు బిగుస్తొంది. విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నిలపై సీఎంఓ ఆరా తీసింది. ఇద్దరు ఐపీఎస్​ల పాత్ర ఏమేరకు ఉందన్న వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు కోరింది. వారివురికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముంబయిలో నమోదైన కేసు వివరాలను సేకరించే పనిలో ఏపీ పోలీసులు ఉన్నారు. ఐపీఎస్‌లే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హీరోయిన్‌ను వేధించిన వైఎస్సార్సీపీ నేతలు, కొందరు ఐపీఎస్‌లు - YSRCP Leaders Harassed Actress

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue

Mumbai Actress Torture Case in AP : ముంబయికి చెందిన సినీనటిపై వైఎస్సార్సీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. సజ్జన్ జిందాల్‌పై ముంబయిలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకే ఆమెపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జన్‌ జిందాల్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబయిలోని బాంద్ర-కుర్ల కాంప్లెక్స్‌ పోలీస్​స్టేషన్‌లో సినీనటి కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సజ్జన్‌ జిందాల్‌పై కేసు : బాంబే హైకోర్టు ఆదేశాలతో గతేడాది డిసెంబర్‌లో సజ్జన్‌ జిందాల్‌పై అత్యాచారంతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు ముంబయిలో సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలోనే విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరిలో సినీనటితో పాటు ఆమె తల్లీదండ్రులపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

YSRCP Leaders Torcher To Mumbai Heroin : ఆ వెంటనే ఆగమేఘాలపైన నాటి డీసీపీ విశాల్‌ గున్నీ, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతురావు, సీఐ శ్రీధర్, ఎస్సై షరిఫ్‌ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబయి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తీసుకురావటం శరవేగంగా జరిగిపోయాయి. మార్చి 15 వరకు సినీనటి, ఆమె తల్లీదండ్రులు విజయవాడ జైల్లోనే ఉన్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు.

YSRCP Leader kukkala Vidya Sagar Issue : ఈ క్రమంలో తాము చెప్పినవాటికల్లా అంగీకరిస్తే బెయిల్‌ వచ్చేలా చేస్తామని లేదంటే నెలల తరబడి జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుందని వారిని నాటి పోలీసు అధికారులు బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఖాకీలే వారికి బెయిల్‌ ఇప్పించి విడుదలయ్యేలా చేశారు. అనంతరం వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆ తర్వాత ముంబయికి వెళ్లిపోయింది.

క్లోజర్‌ రిపోర్ట్ దాఖలు చేసిన పోలీసులు : విజయవాడ జైలు నుంచి సినీనటి కుటుంబం విడుదలైన రెండు రోజులకే బాంద్ర-కుర్ల కాంప్లెక్స్‌ పోలీస్​స్టేషన్‌లో సజ్జన్‌ జిందాల్‌పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. ఆ మేరకు అక్కడి న్యాయస్థానంలో క్లోజర్‌ రిపోర్ట్ దాఖలు చేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలు బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలమివ్వటానికి రావాలని పదే పదే కోరినా రాలేదని పేర్కొంటూ కేసును మూసివేశారు.

జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌కు నాటి ముఖ్యమంత్రి జగన్‌తో సత్సంబంధాలున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో జేఎస్‌డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కూడా చేసింది. ఈ క్రమంలోనే ముంబయిలో సజ్జన్‌ జిందాల్‌పై నమోదైన అత్యాచారం కేసులో ఆయనకు మరిన్ని చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. వారి పట్ల విపరీతమైన స్వామిభక్తి ప్రదర్శించే, వారి అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే నాటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటాకు ముంబయి వివాదం సెటిల్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించారు.

వ్యవహారం చక్కబెట్టిన కాంతిరాణా : రంగంలోకి దిగిన నాటి సీపీ కాంతిరాణా టాటా అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం వ్యవహారం చక్కబెట్టారు. చిన్న జేబుదొంగను పట్టుకున్నా సరే ప్రెస్‌మీట్‌లు పెట్టి, ప్రెస్‌నోట్‌లు విడుదల చేసి హడావుడి చేసేవారు. కానీ ఆయన అత్యంత ప్రాధాన్యతతో కూడిన సినీనటి కేసు వ్యవహారంలో ఎక్కడా చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. అసలు ఆమెను, ఆమె కుటుంబీకుల్ని అరెస్ట్ చేసిన విషయాన్ని ఏ మార్గంలోనూ బహిర్గతం కాకుండా చూశారు. ఆద్యంతం గుట్టుగా సాగిన ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వెలుగుచూసింది.

ముంబయి నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చుట్టు ఉచ్చు బిగుస్తొంది. విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నిలపై సీఎంఓ ఆరా తీసింది. ఇద్దరు ఐపీఎస్​ల పాత్ర ఏమేరకు ఉందన్న వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు కోరింది. వారివురికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముంబయిలో నమోదైన కేసు వివరాలను సేకరించే పనిలో ఏపీ పోలీసులు ఉన్నారు. ఐపీఎస్‌లే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హీరోయిన్‌ను వేధించిన వైఎస్సార్సీపీ నేతలు, కొందరు ఐపీఎస్‌లు - YSRCP Leaders Harassed Actress

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.