ETV Bharat / state

ఇంజినీరింగ్ కళాశాల ఆస్తులపై జగన్​ బంధువు కన్ను- బెదిరించి 7.5ఎకరాలు కబ్జా - YSRCP Leader Grab lands in Kadapa

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 12:35 PM IST

YSRCP Leaders Grab Lands in Kadapa: వైఎస్‌ జగన్‌ అండ చూసుకుని ఆయన అనుచరులు, బంధుగణం గడిచిన ఐదేళ్లలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. కోట్ల రూపాయల విలువైన భూములు, స్థలాలపై కన్నేసిన నాటి వైఎస్సార్సీపీ అనుయాయులు బెదిరించి, భయపెట్టి లాక్కున్నారు. జగన్ సొంత జిల్లా కడపలో ఆయన సమీప బంధువు ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన స్థలంపై కన్నేసి వశం చేసుకున్నాడు. ప్రభుత్వం మారడంతో వైఎస్సార్సీపీ బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు.

YSRCP Leaders Grab Lands in Kadapa
YSRCP Leaders Grab Lands in Kadapa (ETV Bharat)

YSRCP Leaders Grab Lands in Kadapa : కడప శివారులో గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కళాశాల ఉంది. మౌలానా మైనారిటీ వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీకి దశాబ్దాల క్రితమే ప్రభుత్వం 32 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలోని కొంత భాగంలోనే ఈ గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ఈ కళాశాల కరస్పాండెంట్‌ జనార్దన్‌రెడ్డి 10 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన వారికి విక్రయించారు. అయితే 2020లో కడప జిల్లాకు ఆర్కిటెక్చర్‌ అండ్ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ మంజూరైంది. తొలుత చలమారెడ్డిపల్లెలో అద్దె భవనంలో వర్సిటీ నిర్వహించగా 2022లో గ్లోబల్‌ ఇంజినీరింగ్ కళాశాలలోని కొన్ని భవనాలను అద్దెకు తీసుకుని అక్కడే నిర్వహిస్తున్నారు.

గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి నెలకు. 17 లక్షల 60వేల రూపాయలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ వర్సిటీకి జగన్ సమీప బంధువైన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి అక్రమమార్గంలో రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల భూములపై వైఎస్సార్సీపీ నేతలు కన్నేశారు. జగన్ సమీప బంధువులైన దుగ్గాయపల్లె వీరారెడ్డి, మాజీ బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రెడ్డి కలిసి ఏడున్నర ఎకరాలు అక్రమించారని కళాశాల యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

గతంలో భూములు విక్రయించిన వ్యవహారంలో కళాశాల యాజమాన్యానికి రావాల్సిన 4 కోట్ల 75 లక్షల రూపాయలు సైతం బెంగళూరుకు చెందిన వారు చెల్లించకుండా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుపడుతున్నారని జనార్దన్‌రెడ్డి వాపోయారు. రెండేళ్ల నుంచి ఆర్కిటెక్చర్ వర్సిటీ నుంచి రావాల్సిన అద్దె కూడా ఇవ్వడం లేదని అన్నారు. నెలకు 22 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇవ్వకుండా రిజిస్ట్రార్‌ సురేంద్రనాథ్‌రెడ్డి జగన్ బంధువు వీరారెడ్డి కుటుంబ సభ్యులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. వీరారెడ్డి కుటుంబ సభ్యులకు తాము భవనాలను విక్రయించినట్లు దౌర్జన్యం చేసి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని జనార్ధన్ రెడ్డి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు విశ్వాసం వచ్చిందని తమ భూమిని తమకు ఇప్పించాల్సిందిగా జనార్దన్‌రెడ్డి కుటుంబం వేడుకుంటోంది.

రక్షకులే భక్షకులై - వైసీపీ నాయకుల చేతిలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్‌ భూములు

Visakha YCP Leaders Focus on Assigned Lands: విశాఖ అసైన్డ్ భూములపై వైసీపీ నేతల కన్ను.. బెదిరించి ఒప్పందాలు

YSRCP Leaders Grab Lands in Kadapa : కడప శివారులో గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కళాశాల ఉంది. మౌలానా మైనారిటీ వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీకి దశాబ్దాల క్రితమే ప్రభుత్వం 32 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలోని కొంత భాగంలోనే ఈ గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ఈ కళాశాల కరస్పాండెంట్‌ జనార్దన్‌రెడ్డి 10 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన వారికి విక్రయించారు. అయితే 2020లో కడప జిల్లాకు ఆర్కిటెక్చర్‌ అండ్ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ మంజూరైంది. తొలుత చలమారెడ్డిపల్లెలో అద్దె భవనంలో వర్సిటీ నిర్వహించగా 2022లో గ్లోబల్‌ ఇంజినీరింగ్ కళాశాలలోని కొన్ని భవనాలను అద్దెకు తీసుకుని అక్కడే నిర్వహిస్తున్నారు.

గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి నెలకు. 17 లక్షల 60వేల రూపాయలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ వర్సిటీకి జగన్ సమీప బంధువైన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి అక్రమమార్గంలో రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల భూములపై వైఎస్సార్సీపీ నేతలు కన్నేశారు. జగన్ సమీప బంధువులైన దుగ్గాయపల్లె వీరారెడ్డి, మాజీ బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రెడ్డి కలిసి ఏడున్నర ఎకరాలు అక్రమించారని కళాశాల యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

గతంలో భూములు విక్రయించిన వ్యవహారంలో కళాశాల యాజమాన్యానికి రావాల్సిన 4 కోట్ల 75 లక్షల రూపాయలు సైతం బెంగళూరుకు చెందిన వారు చెల్లించకుండా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుపడుతున్నారని జనార్దన్‌రెడ్డి వాపోయారు. రెండేళ్ల నుంచి ఆర్కిటెక్చర్ వర్సిటీ నుంచి రావాల్సిన అద్దె కూడా ఇవ్వడం లేదని అన్నారు. నెలకు 22 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇవ్వకుండా రిజిస్ట్రార్‌ సురేంద్రనాథ్‌రెడ్డి జగన్ బంధువు వీరారెడ్డి కుటుంబ సభ్యులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. వీరారెడ్డి కుటుంబ సభ్యులకు తాము భవనాలను విక్రయించినట్లు దౌర్జన్యం చేసి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని జనార్ధన్ రెడ్డి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు విశ్వాసం వచ్చిందని తమ భూమిని తమకు ఇప్పించాల్సిందిగా జనార్దన్‌రెడ్డి కుటుంబం వేడుకుంటోంది.

రక్షకులే భక్షకులై - వైసీపీ నాయకుల చేతిలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్‌ భూములు

Visakha YCP Leaders Focus on Assigned Lands: విశాఖ అసైన్డ్ భూములపై వైసీపీ నేతల కన్ను.. బెదిరించి ఒప్పందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.