ETV Bharat / state

నాలుగో రోజూ ఏలేరు వరద ప్రభావం - పిఠాపురం నియోజకవర్గంలో స్తంభించిన రాకపోకలు - Yeleru floods in Pithapuram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 7:07 PM IST

Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజూ ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. పొలాలు నీటిలోనే నానుతున్నాయి. గృహాలు, దుకాణాలు, ఆలయాలు సైతం నీటమునిగాయి. గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకువచ్చి సంరక్షించుకుంటున్నారు. రాకపోకలు స్తంభించాయి.

Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency
Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency (ETV Bharat)

Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజూ ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి ఉద్ధృతిలో గోల్లప్రోలు-పిఠాపురం జాతీయ రహదారి మునిగింది. రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వాహనాలను పిఠాపురం ప్రధాన కూడలి సమీపంలో ఆపేసి అచ్చంపేట జంక్షన్ మీదుగా మళ్లించారు. విశాఖ నుంచి కాకినాడ వెళ్లే వాహనాలను కత్తిపూడి జాతీయ రహదారి మీదుగా పంపుతున్నారు. పిఠాపురం-గొల్లప్రోలు రహదారి మీదుగా కేవలం భారీ వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. కార్లు ద్విచక్ర వాహనదారులను పోలీసులు నిలిపేస్తున్నారు.

గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని పొలాలు నీటిలోనే నానుతున్నాయి. జాతీయ రహదారి వెంట ఉన్న గృహాలు, దుకాణాలు, ఆలయాలు నీటమునిగాయి. గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకువచ్చి సంరక్షించుకుంటున్నారు. గొల్లప్రోలు మండలంలోని జగనన్న కాలనీ, సూరంపేట, ఎస్సీపేట, పిఠాపురం మండలంలోని రాపర్తి, రాయవరం, బి.ప్రత్తిపాడు, కొత్తపల్లి మండలంలోని ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలు నీట మునిగాయి.

వరద తాకిడికి అన్నదాత విలవిల- నీటిపారుదల శాఖకు సవాల్​గా గండ్ల పూడ్చివేత - CANALS DAMAGE IN GUNTUR

ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లోని గ్రామాలు గోదావరి వరదలో మునిగాయి. వింజరం, చీరవెల్లి మధ్య ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. కుకునూరు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. విలీన మండలాల్లో 25 గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి. పంట పొలాలు సైతం నీట మునిగాయి.

భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వస్తున్న నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి సముద్రంలోకి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడిచి పెడుతున్నారు. దీంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రవహించే గౌతమీ గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి నదీపాయలు ప్రమాద భరితంగా ప్రవహిస్తున్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతం యానాం బాలయోగి వారధి వద్ద గౌతమీ గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిస్థితిని డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.

నిద్రలేచే సరికి నీళ్ల మధ్యలో ఆవాసాలు- కాకినాడలో ఏలేరు ఉగ్రరూపం - Yeleru Floods in Kakinada

బ్యారేజీ దిగువన ఉన్న కనకాయలంక, బూరుగులంక, ఆనగాలంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక, అయోధ్య లంక, పెద్దమలంక, వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలోనే మూడు పర్యాయాలు వరదలు సంభవించడంతో లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పూర్తిగా నీటి మునిగి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పశువులకు పచ్చి మేత గ్రాసం కూడా దొరకటం లేదని వాపోతున్నారు.

ఉత్తరాంధ్రలో వరద బీభత్సం - ప్రజాప్రతినిధులు పర్యటించి చక్కదిద్దే ప్రయత్నం - FLOOD EFFECT IN UTTARANDRA

Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజూ ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి ఉద్ధృతిలో గోల్లప్రోలు-పిఠాపురం జాతీయ రహదారి మునిగింది. రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వాహనాలను పిఠాపురం ప్రధాన కూడలి సమీపంలో ఆపేసి అచ్చంపేట జంక్షన్ మీదుగా మళ్లించారు. విశాఖ నుంచి కాకినాడ వెళ్లే వాహనాలను కత్తిపూడి జాతీయ రహదారి మీదుగా పంపుతున్నారు. పిఠాపురం-గొల్లప్రోలు రహదారి మీదుగా కేవలం భారీ వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. కార్లు ద్విచక్ర వాహనదారులను పోలీసులు నిలిపేస్తున్నారు.

గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని పొలాలు నీటిలోనే నానుతున్నాయి. జాతీయ రహదారి వెంట ఉన్న గృహాలు, దుకాణాలు, ఆలయాలు నీటమునిగాయి. గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకువచ్చి సంరక్షించుకుంటున్నారు. గొల్లప్రోలు మండలంలోని జగనన్న కాలనీ, సూరంపేట, ఎస్సీపేట, పిఠాపురం మండలంలోని రాపర్తి, రాయవరం, బి.ప్రత్తిపాడు, కొత్తపల్లి మండలంలోని ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలు నీట మునిగాయి.

వరద తాకిడికి అన్నదాత విలవిల- నీటిపారుదల శాఖకు సవాల్​గా గండ్ల పూడ్చివేత - CANALS DAMAGE IN GUNTUR

ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లోని గ్రామాలు గోదావరి వరదలో మునిగాయి. వింజరం, చీరవెల్లి మధ్య ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. కుకునూరు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. విలీన మండలాల్లో 25 గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి. పంట పొలాలు సైతం నీట మునిగాయి.

భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వస్తున్న నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి సముద్రంలోకి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడిచి పెడుతున్నారు. దీంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రవహించే గౌతమీ గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి నదీపాయలు ప్రమాద భరితంగా ప్రవహిస్తున్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతం యానాం బాలయోగి వారధి వద్ద గౌతమీ గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిస్థితిని డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.

నిద్రలేచే సరికి నీళ్ల మధ్యలో ఆవాసాలు- కాకినాడలో ఏలేరు ఉగ్రరూపం - Yeleru Floods in Kakinada

బ్యారేజీ దిగువన ఉన్న కనకాయలంక, బూరుగులంక, ఆనగాలంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక, అయోధ్య లంక, పెద్దమలంక, వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలోనే మూడు పర్యాయాలు వరదలు సంభవించడంతో లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పూర్తిగా నీటి మునిగి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పశువులకు పచ్చి మేత గ్రాసం కూడా దొరకటం లేదని వాపోతున్నారు.

ఉత్తరాంధ్రలో వరద బీభత్సం - ప్రజాప్రతినిధులు పర్యటించి చక్కదిద్దే ప్రయత్నం - FLOOD EFFECT IN UTTARANDRA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.