ETV Bharat / state

ఏపీలో మెట్రో ప్రాజెక్టులు పరుగులు - నాలుగు కారిడార్లుగా విశాఖ, రెండు దశల్లో విజయవాడ - అమరావతి - Metro Rail Projects in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 8:04 AM IST

Visakhapatnam and Vijayawada Metro Rail Projects: ఏపీ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Visakhapatnam and Vijayawada Metro Rail Projects
Visakhapatnam and Vijayawada Metro Rail Projects (ETV Bharat)

Visakhapatnam and Vijayawada Metro Rail Projects: జగన్‌ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విశాఖపట్నం, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. సవరించిన డీపీఆర్‌ల ప్రకారం రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు 25 వేల 130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు 17 వేల 232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో: విజయవాడ-అమరావతి మెట్రో రైలు (VIJAYAWADA AMARAVATI METRO RAIL ) ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. దీని మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు ఉండనుంది. తొలి దశలో 38.40 కి.మీ కాగా దీని నిర్మాణ వ్యయం 11 వేల 009 కోట్ల రూపాయలు. తొలిదశను విజయవాడలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ, అదే విధంగా బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ నిర్మించనున్నారు. రెండో దశలో 27.80 కిలోమీటర్లను 14 వేల 121 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. దీనిని పండిట్‌నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రాజధాని అమరావతి వరకూ నిర్మించాలని ప్రతిపాదించారు.

నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో: విశాఖ మెట్రోరైలు (Vijayawada Metro Rail) ప్రాజెక్టును రెండుదశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలన్నది ప్రతిపాదించారు. నాలుగు కారిడార్లు కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మిస్తారు. మొత్తం 54 స్టేషన్లు ఉంటాయి. తొలిదశలో చేపట్టే మూడు కారిడార్ల మొత్తం పొడవు 46.23 కి.మీ ఉండనుంది. మూడు కారిడార్ల నిర్మాణవ్యయం 11 వేల 498 కోట్ల రూపాయలు.

ఇందులో కారిడార్‌ 1ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకూ 34.40 కి.మీ పొడవుతో 29 స్టేషన్లు ఉండనున్నాయి. ఇక కారిడార్‌ 2ను గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ 5.07 కి.మీ పొడవుతో 6 స్టేషన్లతో, కారిడార్‌ 3ని తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ పొడవుతో 7 స్టేషన్లతో నిర్మించాలని ప్రతిపాదించారు.

రెండో దశలో ఒకటే కారిడార్‌: విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులో రెండో దశలో ఒకటే కారిడార్‌ ఉండనుంది. దీని నిర్మాణ వ్యయం 5 వేల 734 కోట్ల రూపాయలు. రెండో దశలో కారిడార్‌ 4ను నిర్మించున్నారు. ఇది కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ మొత్తం 30.67 కి.మీ పొడవుతో 12 స్టేషన్లు కలిగి ఉంటుంది.

ఏపీ మెట్రోరైలు ఎండీగా రామకృష్ణారెడ్డి - AP Metro Rail MD Appointed by Govt

మొత్తం ఖర్చు కేంద్రం భరించాలని కోరుతున్నాం: విశాఖ, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి వాటి నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు చాలా కసరత్తు చేసి కేంద్రం ఆమోదానికి పంపామని, కొత్త పాలసీ తెస్తున్నామని, దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. సవరించిన అంచనాల్ని, డీపీఆర్‌లను కేంద్రానికి పంపిస్తున్నామని తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనుల్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు పేర్కొన్నారు. సీఎంతో జరిగిన మీటింగ్​లో మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO

Visakhapatnam and Vijayawada Metro Rail Projects: జగన్‌ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విశాఖపట్నం, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. సవరించిన డీపీఆర్‌ల ప్రకారం రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు 25 వేల 130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు 17 వేల 232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో: విజయవాడ-అమరావతి మెట్రో రైలు (VIJAYAWADA AMARAVATI METRO RAIL ) ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. దీని మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు ఉండనుంది. తొలి దశలో 38.40 కి.మీ కాగా దీని నిర్మాణ వ్యయం 11 వేల 009 కోట్ల రూపాయలు. తొలిదశను విజయవాడలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ, అదే విధంగా బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ నిర్మించనున్నారు. రెండో దశలో 27.80 కిలోమీటర్లను 14 వేల 121 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. దీనిని పండిట్‌నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రాజధాని అమరావతి వరకూ నిర్మించాలని ప్రతిపాదించారు.

నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో: విశాఖ మెట్రోరైలు (Vijayawada Metro Rail) ప్రాజెక్టును రెండుదశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలన్నది ప్రతిపాదించారు. నాలుగు కారిడార్లు కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మిస్తారు. మొత్తం 54 స్టేషన్లు ఉంటాయి. తొలిదశలో చేపట్టే మూడు కారిడార్ల మొత్తం పొడవు 46.23 కి.మీ ఉండనుంది. మూడు కారిడార్ల నిర్మాణవ్యయం 11 వేల 498 కోట్ల రూపాయలు.

ఇందులో కారిడార్‌ 1ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకూ 34.40 కి.మీ పొడవుతో 29 స్టేషన్లు ఉండనున్నాయి. ఇక కారిడార్‌ 2ను గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ 5.07 కి.మీ పొడవుతో 6 స్టేషన్లతో, కారిడార్‌ 3ని తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ పొడవుతో 7 స్టేషన్లతో నిర్మించాలని ప్రతిపాదించారు.

రెండో దశలో ఒకటే కారిడార్‌: విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులో రెండో దశలో ఒకటే కారిడార్‌ ఉండనుంది. దీని నిర్మాణ వ్యయం 5 వేల 734 కోట్ల రూపాయలు. రెండో దశలో కారిడార్‌ 4ను నిర్మించున్నారు. ఇది కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ మొత్తం 30.67 కి.మీ పొడవుతో 12 స్టేషన్లు కలిగి ఉంటుంది.

ఏపీ మెట్రోరైలు ఎండీగా రామకృష్ణారెడ్డి - AP Metro Rail MD Appointed by Govt

మొత్తం ఖర్చు కేంద్రం భరించాలని కోరుతున్నాం: విశాఖ, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి వాటి నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు చాలా కసరత్తు చేసి కేంద్రం ఆమోదానికి పంపామని, కొత్త పాలసీ తెస్తున్నామని, దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. సవరించిన అంచనాల్ని, డీపీఆర్‌లను కేంద్రానికి పంపిస్తున్నామని తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనుల్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు పేర్కొన్నారు. సీఎంతో జరిగిన మీటింగ్​లో మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.