ETV Bharat / state

నీతి ఆయోగ్‌ భేటీ - 'వికసిత్‌ ఏపీ 2047' అంశాలు ప్రస్తావించిన చంద్రబాబు - chandrababu in Niti Aayog

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 3:43 PM IST

Updated : Jul 27, 2024, 7:15 PM IST

CM Chandrababu Presented Vikasit AP 2047 Vision Document: నీతి ఆయోగ్‌ సమావేశం చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్‌ చేపట్టింది. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రస్తావించారు.

CM Chandrababu Presented Vikasit AP 2047 Vision Document
CM Chandrababu Presented Vikasit AP 2047 Vision Document (ETV Bharat)

CM Chandrababu Presented Vikasit AP 2047 Vision Document : వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్​ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు ప్రసావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు వివరించారు.

నీతి ఆయోగ్‌ భేటీలో విజన్‌ 2047 డాక్యుమెంట్‌పై మాట్లాడిన చంద్రబాబు, గతంలో తాను రూపొందించిన విజన్‌-2047పై ప్రస్తావించారు. విజన్‌ 2047 డాక్యుమెంట్‌ దేశానికి ఉపయోగపడేలా చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో 'గ్రీన్‌ టెక్నాలజీ' వినియోగించాలని, విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. హైడ్రోజన్‌ వినియోగం, విద్యుత్‌ రంగంలో సంస్కరణలపై శ్రద్ధ పెట్టాలని, పేదరికం రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

CM Chandrababu Presented Vikasit AP 2047 Vision Document : వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్​ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు ప్రసావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు వివరించారు.

నీతి ఆయోగ్‌ భేటీలో విజన్‌ 2047 డాక్యుమెంట్‌పై మాట్లాడిన చంద్రబాబు, గతంలో తాను రూపొందించిన విజన్‌-2047పై ప్రస్తావించారు. విజన్‌ 2047 డాక్యుమెంట్‌ దేశానికి ఉపయోగపడేలా చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో 'గ్రీన్‌ టెక్నాలజీ' వినియోగించాలని, విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. హైడ్రోజన్‌ వినియోగం, విద్యుత్‌ రంగంలో సంస్కరణలపై శ్రద్ధ పెట్టాలని, పేదరికం రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

Last Updated : Jul 27, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.