ETV Bharat / state

‘మేడిగడ్డ’ కుంగుబాటులో వారి పాత్ర! - విచారణ కమిషన్‌కు విజిలెన్స్‌ మధ్యంతర నివేదిక - Vigilance Report On Medigadda

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 8:29 AM IST

Updated : Aug 20, 2024, 8:59 AM IST

Vigilance Report On Medigadda : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటి పారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆక్షేపించింది. ఈ మేరకు కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపుతూ జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు మధ్యంతర నివేదిక సమర్పించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సూచించింది.

Vigilance Report On Medigadda
Vigilance Report On Medigadda (ETV Bharat)

Vigilance Report On Medigadda : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మధ్యంతర నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ మధ్యంతర నివేదిక అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం పలు కీలక అంశాలను గుర్తించింది.

గతంలోనే ఈ అంశాలు చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా రామగుండం ఈఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లును తొలగించిన ప్రభుత్వం ఈఎన్సీ జనరల్‌గా ఉన్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని అప్పట్లోనే ఆదేశించింది. అప్పట్లో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటి పారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆక్షేపించింది.

మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు : ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపింది. నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని, భద్రతకు సంబంధించిన నిబంధనల గురించి పట్టించుకోలేదని వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్​నకు సంబంధించి 16 నుంచి 21 వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది.

3డి నమూనాకు అనుగుణంగా అప్‌ స్ట్రీమ్‌, డౌన్‌ స్ట్రీమ్‌ భారాన్ని సరి చేయలేదని తెలిపింది. 6, 7, 8 బ్లాకులను ఎల్​ అండ్​ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్‌ తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదన్న విజిలెన్స్ విభాగం దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది.

ఫ్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ : 2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్‌లో తాఖీదులు ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ, ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది. బ్యారేజీ ఆపరేషన్‌లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది పేర్కొంది. 2019 నవంబర్‌లోనే "ప్లింత్ స్లాబ్ జాయింట్" డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి నిర్వహణ లేదని నివేదికలో తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ - బుధవారం నుంచి పీసీ ఘోష్​ కమిషన్ బహిరంగ విచారణ - justice pc ghosh commission

రాఫ్ట్, సీకెంట్ పైల్స్ నిర్ధిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని, ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని తెలిపింది. పనులు మిగిలి ఉండగానే 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని, బ్యాంకు గ్యారంటీల విడుదలకు 2020 నవంబర్ 11న ఈఎన్సీ లేఖ రాయడం తప్పని ఆక్షేపించిన విజిలెన్స్ విభాగం ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

నిపుణుల కమిటీ వేయాలి : ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తెలిపింది. పనులు పూర్తి కాకముందే పూర్తైనట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు ఆక్షేపించింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌కు సంబంధించి రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్స్, జియోలజికల్ ఇన్వెస్టిగేషన్స్‌తో పాటు అన్ని ఆర్​సీసీ భాగాల స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ తదితరాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం తప్పనిసరని పేర్కొంది. ఆనకట్ట వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు వీలుగా నిపుణుల కమిటీని వేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

మధ్యంతర నివేదిక సమర్పించిన సీవీ ఆనంద్ : మధ్యంతర నివేదిక గతంలోనే సిద్ధమైన్పటికీ అప్పటి విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంతో సమర్పించలేదు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ విజిలెన్స్ నివేదిక గురించి పలుమార్లు ఆరా తీశారు. విజిలెన్స్ విభాగం డీజీగా ఇటీవల అదనపు బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ సోమవారం జస్టిస్ పీసీ ఘోష్‌ను కలిసి మధ్యంతర నివేదిక సమర్పించారు.

ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణం, పనులు, డిజైన్లు, నిర్వహణ తదితరాల్లో ఉన్న లోపాలను మధ్యంతర నివేదికలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. 21 మంది ఇంజినీర్లను నివేదికలో విజిలెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. సీవీ ఆనంద్‌ను మరికొన్ని అంశాలపైనా ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. విజిలెన్స్ విభాగం స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, ప్రతులను కూడా తమకు ఇవ్వాలని కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

కీలక దశకు చేరుకున్న కాళేశ్వరంపై విచారణ - గత ప్రభుత్వ పెద్దలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఫోకస్‌ - PC Ghosh Commission

Vigilance Report On Medigadda : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మధ్యంతర నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ మధ్యంతర నివేదిక అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం పలు కీలక అంశాలను గుర్తించింది.

గతంలోనే ఈ అంశాలు చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా రామగుండం ఈఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లును తొలగించిన ప్రభుత్వం ఈఎన్సీ జనరల్‌గా ఉన్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని అప్పట్లోనే ఆదేశించింది. అప్పట్లో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటి పారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆక్షేపించింది.

మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు : ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపింది. నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని, భద్రతకు సంబంధించిన నిబంధనల గురించి పట్టించుకోలేదని వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్​నకు సంబంధించి 16 నుంచి 21 వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది.

3డి నమూనాకు అనుగుణంగా అప్‌ స్ట్రీమ్‌, డౌన్‌ స్ట్రీమ్‌ భారాన్ని సరి చేయలేదని తెలిపింది. 6, 7, 8 బ్లాకులను ఎల్​ అండ్​ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్‌ తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదన్న విజిలెన్స్ విభాగం దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది.

ఫ్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ : 2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్‌లో తాఖీదులు ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ, ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది. బ్యారేజీ ఆపరేషన్‌లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది పేర్కొంది. 2019 నవంబర్‌లోనే "ప్లింత్ స్లాబ్ జాయింట్" డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి నిర్వహణ లేదని నివేదికలో తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ - బుధవారం నుంచి పీసీ ఘోష్​ కమిషన్ బహిరంగ విచారణ - justice pc ghosh commission

రాఫ్ట్, సీకెంట్ పైల్స్ నిర్ధిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని, ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని తెలిపింది. పనులు మిగిలి ఉండగానే 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని, బ్యాంకు గ్యారంటీల విడుదలకు 2020 నవంబర్ 11న ఈఎన్సీ లేఖ రాయడం తప్పని ఆక్షేపించిన విజిలెన్స్ విభాగం ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

నిపుణుల కమిటీ వేయాలి : ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తెలిపింది. పనులు పూర్తి కాకముందే పూర్తైనట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు ఆక్షేపించింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌కు సంబంధించి రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్స్, జియోలజికల్ ఇన్వెస్టిగేషన్స్‌తో పాటు అన్ని ఆర్​సీసీ భాగాల స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ తదితరాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం తప్పనిసరని పేర్కొంది. ఆనకట్ట వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు వీలుగా నిపుణుల కమిటీని వేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

మధ్యంతర నివేదిక సమర్పించిన సీవీ ఆనంద్ : మధ్యంతర నివేదిక గతంలోనే సిద్ధమైన్పటికీ అప్పటి విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంతో సమర్పించలేదు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ విజిలెన్స్ నివేదిక గురించి పలుమార్లు ఆరా తీశారు. విజిలెన్స్ విభాగం డీజీగా ఇటీవల అదనపు బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ సోమవారం జస్టిస్ పీసీ ఘోష్‌ను కలిసి మధ్యంతర నివేదిక సమర్పించారు.

ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణం, పనులు, డిజైన్లు, నిర్వహణ తదితరాల్లో ఉన్న లోపాలను మధ్యంతర నివేదికలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. 21 మంది ఇంజినీర్లను నివేదికలో విజిలెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. సీవీ ఆనంద్‌ను మరికొన్ని అంశాలపైనా ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. విజిలెన్స్ విభాగం స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, ప్రతులను కూడా తమకు ఇవ్వాలని కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

కీలక దశకు చేరుకున్న కాళేశ్వరంపై విచారణ - గత ప్రభుత్వ పెద్దలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఫోకస్‌ - PC Ghosh Commission

Last Updated : Aug 20, 2024, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.