ETV Bharat / state

ట్రాక్‌ మరమ్మతులు పూర్తి - విజయవాడ -హైదరాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ - kazipet to Vijayawada Trains Cancel

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 7:21 AM IST

Updated : Sep 4, 2024, 2:00 PM IST

Trains Between Kazipet and Vijayawada Have Been Cancelled : రాష్ట్రంలో కురిసిన భారీ వానలకు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్​లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు వాటిని పునరుద్దరించే పనిలో పడ్డారు. కాగా మహబూబాబాద్​ రైల్వై ట్రాక్​ పనులు పూర్తి అయ్యాయి. దీంతో వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను అధికారులు పంపుతున్నారు.

Restoration of Trains Between Vijayawada-Hyderabad
Renovation of Railway Track Between Kazipet-Vijayawada (ETV Bharat)

Restoration of Trains Between Vijayawada-Hyderabad : రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి, మరిన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. దెబ్బతిన్న ట్రాక్​లను సరిచేసే పనిలో పడింది. కాజీపేట-విజయవాడ సెక్షన్​లో వానలకు దెబ్బతిన్న ట్రాక్​ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.

తాజాగా భారీ వర్షాలతో కోతకు గురైన మహబూబాబాద్‌లోని రైల్వే ట్రాక్‌ మరమ్మతు పనులు పూర్తయినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇంటికన్నె - కే.సముద్రం మధ్య ట్రాక్‌ కిందిభాగం వరదకు కొట్టుకుపోగా, సుమారు 500ల మంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపట్టారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్​ప్రెస్‌ను ఈ మార్గంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా రైళ్ల రాకపోకలు అప్‌లైన్‌లో కొనసాగుతాయన్నారు. డౌన్‌లైన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని సాయంత్రం వరకు ఈ మార్గంలోనూ నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెండులైన్లు అందుబాటులోకి వస్తే రద్దయిన రైళ్లను వరసగా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్​ - తెలంగాణ, విజయవాడ మధ్య రైళ్లు రద్దు - Railway track washed in Kesamudram

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో వరద విలయ తాండవం సృష్టించి మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే స్టేషన్ శివారులో 418కిలో మీటరు మైలురాయి వద్ద 42 మీటర్ల పొడవున రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాలిలో తేలాయి. వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. రైల్వే శాఖ సిబ్బంది నాలుగు రోజులుగా రైలు పట్టాల మరమ్మతు పనులు చేపట్టారు. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్స్ విభాగం విద్యుత్ సరఫరా లైన్ పనులు, కమ్యూనికేశన్స్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.

బుధవారానికి అందుబాటులోకి : వర్షం పడుతుండడం, నీటి ప్రవాహం వస్తుండటంతో పెద్ద పెద్ద బండరాళ్లతో అడ్డుకట్టలా వేస్తున్నామని, బుధవారం ఉదయానికి ఒక లైన్​ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకల్ని ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఈటీవీ భారత్​కు తెలిపారు. సాయంత్రానికి రెండో లైన్​ను అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు.

563కు రద్దయిన రైళ్ల సంఖ్య : కాజీపేట - విజయవాడ మార్గంలో మంగళవారం పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు రద్దయిన రైళ్ల సంఖ్య 563. 185 రైళ్లను దారి మళ్లించి మరీ నడుపుతున్నారు. 3, 4 తేదీల్లో పదుల సంఖ్యలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.

ప్రయాణికులకు ముఖ్య గమనిక - వర్షాల కారణంగా 481 రైళ్లు, 570 ఆర్టీసీ బస్సులు రద్దు - TRAINS CANCELLED

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

Restoration of Trains Between Vijayawada-Hyderabad : రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి, మరిన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. దెబ్బతిన్న ట్రాక్​లను సరిచేసే పనిలో పడింది. కాజీపేట-విజయవాడ సెక్షన్​లో వానలకు దెబ్బతిన్న ట్రాక్​ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.

తాజాగా భారీ వర్షాలతో కోతకు గురైన మహబూబాబాద్‌లోని రైల్వే ట్రాక్‌ మరమ్మతు పనులు పూర్తయినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇంటికన్నె - కే.సముద్రం మధ్య ట్రాక్‌ కిందిభాగం వరదకు కొట్టుకుపోగా, సుమారు 500ల మంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపట్టారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్​ప్రెస్‌ను ఈ మార్గంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా రైళ్ల రాకపోకలు అప్‌లైన్‌లో కొనసాగుతాయన్నారు. డౌన్‌లైన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని సాయంత్రం వరకు ఈ మార్గంలోనూ నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెండులైన్లు అందుబాటులోకి వస్తే రద్దయిన రైళ్లను వరసగా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్​ - తెలంగాణ, విజయవాడ మధ్య రైళ్లు రద్దు - Railway track washed in Kesamudram

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో వరద విలయ తాండవం సృష్టించి మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే స్టేషన్ శివారులో 418కిలో మీటరు మైలురాయి వద్ద 42 మీటర్ల పొడవున రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాలిలో తేలాయి. వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. రైల్వే శాఖ సిబ్బంది నాలుగు రోజులుగా రైలు పట్టాల మరమ్మతు పనులు చేపట్టారు. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్స్ విభాగం విద్యుత్ సరఫరా లైన్ పనులు, కమ్యూనికేశన్స్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.

బుధవారానికి అందుబాటులోకి : వర్షం పడుతుండడం, నీటి ప్రవాహం వస్తుండటంతో పెద్ద పెద్ద బండరాళ్లతో అడ్డుకట్టలా వేస్తున్నామని, బుధవారం ఉదయానికి ఒక లైన్​ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకల్ని ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఈటీవీ భారత్​కు తెలిపారు. సాయంత్రానికి రెండో లైన్​ను అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు.

563కు రద్దయిన రైళ్ల సంఖ్య : కాజీపేట - విజయవాడ మార్గంలో మంగళవారం పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు రద్దయిన రైళ్ల సంఖ్య 563. 185 రైళ్లను దారి మళ్లించి మరీ నడుపుతున్నారు. 3, 4 తేదీల్లో పదుల సంఖ్యలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.

ప్రయాణికులకు ముఖ్య గమనిక - వర్షాల కారణంగా 481 రైళ్లు, 570 ఆర్టీసీ బస్సులు రద్దు - TRAINS CANCELLED

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

Last Updated : Sep 4, 2024, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.