ETV Bharat / state

నగరంలో రోడ్డెక్కనున్న మరో 438 ఎలక్ట్రిక్ బస్సులు - ఈవీ ఛార్జింగ్ పాయింట్లపైనా టీజీఎస్​ ఆర్టీసీ ఫోకస్​ - TGSRTC on Electric Buses

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 9:48 PM IST

Updated : Jul 23, 2024, 10:19 PM IST

Electric Buses in Hyderabad : కాలుష్యరహిత బస్సుల వైపు టీజీఎస్ ఆర్టీసీ మొగ్గుచూపుతుంది. ఇంధనం ఖర్చును తగ్గిస్తూ ఆదాయం పెంచుకోవాలంటే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చేయడమే మేలని సంస్థ అభిప్రాయపడుతుంది. 540 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 102 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. వీటికి అదనంగా మరో 438 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుంది. వీలైనంత త్వరగా నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులను పరుగులు పెట్టించాలని యాజమాన్యం నిర్ణయించింది. అవి అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు ప్రజా రవాణా మరింత చేరువవుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

TGSRTC on Electric Buses in Hyderabad
Electric Buses in Hyderabad (ETV Bharat)

TGSRTC on Electric Buses in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్​లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 102 ఎలక్ట్రికల్ బస్సులను తిప్పుతున్నారు. వీటికి అదనంగా మరో 438 బస్సులను విడుతల వారీగా తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. కేవలం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కాకుండా వాటికి అవసరమైన ఈవీ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్​లో 102 ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. అందులో 77 ఏసీ, 25 నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి.

వీటిలో 50 ఏసీ బస్సులను విమానాశ్రయ మార్గంలో తిప్పుతున్నారు. ఐటీ ఉద్యోగుల కోసం ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు చొప్పున బాచుపల్లి-వేవ్ రాక్​కు 7 ఏసీ బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. కోఠి-కొండాపూర్ మార్గంలో 6, సికింద్రాబాద్-పటాన్​చెరు మార్గంలో 14 ఏసీ బస్సులను నడిపిస్తున్నారు. 25 నాన్ ఏసీ బస్సుల్లో పటాన్​చెరు-సీబీఎస్ మార్గంలో 6, పటాన్​చెరు -హైటెక్ సిటీ మార్గంలో 5, సికింద్రాబాద్ -మణికొండ మార్గంలో 12, మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో 2 బస్సులను నడిపిస్తున్నారు.

ఐదు డిపోల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు : ఆర్టీసీ యాజమాన్యం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం పలు డిపోల్లో ఏర్పాట్లు చేసింది. కంటోన్మెంట్, మియాపూర్​లో పనులు పూర్తయి విద్యుత్ సరఫరా జరుగుతుండగా మిగిలిన డిపోల్లో వేగంగా పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్​లో పనులు పూర్తయినప్పటికీ చీఫ్ ఎలక్ట్రికల్ అధికారి అనుమతి ఇచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా ప్రారంభించనున్నారు. హెచ్.సీ.యూలో ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ యూనిట్​ను నెలరోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేబీఎస్​కు మరో ఛార్జింగ్ యూనిట్​కు టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ఐదు డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు సిద్ధమైతే విడతలవారీగా 438 విద్యుత్ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లుపై ఫోకస్​ : విడతలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పూర్తయ్యేలోగా ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించే దిశగా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందుకు సుమారు రూ.17 కోట్లను ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. ఐదు డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుకు నిర్ణయించగా కంటోన్మెంట్, మియాపూర్​లో పనులు పూర్తయ్యాయి. ఒలెక్ట్రా సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెలరోజుల్లో మరికొన్ని విద్యుత్ బస్సులు రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి.

కంటోన్మెంట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.1.24 కోట్లు, మియాపూర్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.35 లక్షలు, బీహెచ్ఈఎల్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.3.9 కోట్లు, హెచ్.సీయూ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.2.49 కోట్లు, జేబీఎస్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.9 కోట్లు ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. ఒకవైపు బస్సులను సమకూర్చుకోవడంతో పాటు మరోవైపు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా వేగంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు.

TSRTC Electric Bus : ఆగస్టు నెలాఖరు నాటికి భాగ్యనగర రోడ్లపై మరో 25 ఈవీ బస్సుల రయ్​.. రయ్​.. ఈ విషయాలు తెలుసుకోండి

TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్

TGSRTC on Electric Buses in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్​లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 102 ఎలక్ట్రికల్ బస్సులను తిప్పుతున్నారు. వీటికి అదనంగా మరో 438 బస్సులను విడుతల వారీగా తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. కేవలం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కాకుండా వాటికి అవసరమైన ఈవీ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్​లో 102 ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. అందులో 77 ఏసీ, 25 నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి.

వీటిలో 50 ఏసీ బస్సులను విమానాశ్రయ మార్గంలో తిప్పుతున్నారు. ఐటీ ఉద్యోగుల కోసం ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు చొప్పున బాచుపల్లి-వేవ్ రాక్​కు 7 ఏసీ బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. కోఠి-కొండాపూర్ మార్గంలో 6, సికింద్రాబాద్-పటాన్​చెరు మార్గంలో 14 ఏసీ బస్సులను నడిపిస్తున్నారు. 25 నాన్ ఏసీ బస్సుల్లో పటాన్​చెరు-సీబీఎస్ మార్గంలో 6, పటాన్​చెరు -హైటెక్ సిటీ మార్గంలో 5, సికింద్రాబాద్ -మణికొండ మార్గంలో 12, మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో 2 బస్సులను నడిపిస్తున్నారు.

ఐదు డిపోల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు : ఆర్టీసీ యాజమాన్యం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం పలు డిపోల్లో ఏర్పాట్లు చేసింది. కంటోన్మెంట్, మియాపూర్​లో పనులు పూర్తయి విద్యుత్ సరఫరా జరుగుతుండగా మిగిలిన డిపోల్లో వేగంగా పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్​లో పనులు పూర్తయినప్పటికీ చీఫ్ ఎలక్ట్రికల్ అధికారి అనుమతి ఇచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా ప్రారంభించనున్నారు. హెచ్.సీ.యూలో ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ యూనిట్​ను నెలరోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేబీఎస్​కు మరో ఛార్జింగ్ యూనిట్​కు టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ఐదు డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు సిద్ధమైతే విడతలవారీగా 438 విద్యుత్ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లుపై ఫోకస్​ : విడతలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పూర్తయ్యేలోగా ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించే దిశగా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందుకు సుమారు రూ.17 కోట్లను ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. ఐదు డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుకు నిర్ణయించగా కంటోన్మెంట్, మియాపూర్​లో పనులు పూర్తయ్యాయి. ఒలెక్ట్రా సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెలరోజుల్లో మరికొన్ని విద్యుత్ బస్సులు రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి.

కంటోన్మెంట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.1.24 కోట్లు, మియాపూర్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.35 లక్షలు, బీహెచ్ఈఎల్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.3.9 కోట్లు, హెచ్.సీయూ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.2.49 కోట్లు, జేబీఎస్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.9 కోట్లు ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. ఒకవైపు బస్సులను సమకూర్చుకోవడంతో పాటు మరోవైపు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా వేగంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు.

TSRTC Electric Bus : ఆగస్టు నెలాఖరు నాటికి భాగ్యనగర రోడ్లపై మరో 25 ఈవీ బస్సుల రయ్​.. రయ్​.. ఈ విషయాలు తెలుసుకోండి

TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్

Last Updated : Jul 23, 2024, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.