ETV Bharat / state

నష్టాలొచ్చే విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం - పాతబస్తీ ప్రాంతం అదానీకి! - loss making electricity circles

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 12:55 PM IST

Electricity circles: కొన్ని విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా హైదరాబాద్‌ దక్షిణ (సౌత్‌) విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాన్ని, అదానీ సంస్థకు అప్పగించనుంది. ఇప్పటికే అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాతబస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో అత్యధికంగా సుమారు 41.4 శాతం నష్టాలు మూటగట్టుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Loss making electricity circles: కరెంటు సరఫరా, పంపిణీ, వాణిజ్య (ATC) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా, హైదరాబాద్‌ దక్షిణ (సౌత్‌) విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాన్ని, అదానీ సంస్థకు అప్పగించబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే తెలిపారు. అందుకు సంబంధించి ఉన్నతస్థాయిలో సమావేశాలు జరిగాయి. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కంల నుంచి సమాచారం తీసుకుంది.

కరెంటు పంపిణీ, బిల్లుల వసూలను బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలంటే మెుదట రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇవ్వాలి. తర్వాత డిస్కంలు టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ, ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాతబస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాతబస్తీని అప్పగిస్తున్నందున, భవిష్యత్తులో నష్టాలొచ్చే ఇతర విద్యుత్‌ సర్కిళ్లకూ అదే విధానం వర్తిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘సౌత్‌’ సర్కిల్‌లో ఎక్కువగా: హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో అత్యధికంగా సుమారు 41.4 శాతం నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. దీని పరిధిలోని బార్కాస్‌ ఫీడర్‌లో ఏకంగా 90.7 శాతం నష్టాలు నమోదయ్యాయి. ఈ సర్కిల్‌లో పరిధిలో రోజూ రూ.మూడు కోట్ల విలువైన కరెంటు సరఫరా చేస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ. కోటిన్నర ఆదాయమే తిరిగి వస్తోంది. మిగతా కోటిన్నరను దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ (డిస్కం) నష్టాలుగా చూపెడుతుంది. ఈ ఒక్క సర్కిల్‌ నుంచే ఏటా రూ.500 కోట్లకు పైగా డిస్కం నష్టపోతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంల వార్షిక నష్టాలు రూ.5,500 కోట్లకు పైగా ఉన్నాయి. వాస్తవంగా సరఫరాలో సాంకేతిక సమస్యల వల్ల నష్టం సగటున 10-12 శాతం కాగా, విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేత వంటివే నష్టాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఎలాంటి ఉపయోగం లేదు - కమిషన్‌తో నిపుణులు వెల్లడి - Justice Narasimha Reddy Commission

దక్షిణ తెలంగాణ డిస్కం: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2022-23లో మొత్తం 55,155.92 మిలియన్‌ యూనిట్ల కరెంటు కొంటే, సరఫరా నష్టాలు పోను 51,242.69 మి.యూ. పంపిణీ చేశారు. ఈ పంపిణీలో చౌర్యం, బిల్లులు కట్టకపోవడం వంటి కారణాలతో చివరికి 46,887.55 మి.యూ.కి మాత్రమే బిల్లుల రూపంలో రాబడి వచ్చింది. 2022-23లో ఈ డిస్కం ఏటీసీ నష్టాలు 19.09 శాతంగా నమోదైతే.. పాతబస్తీలో నష్టాలు ఏకంగా 41 శాతం ఉన్నాయి.

ఉత్తర డిస్కం: ఉత్తర డిస్కం పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఏటీసీ నష్టాలు సంవత్సరం అత్యధికంగా 37 శాతం నమోదయ్యాయి. కానీ ఈ జిల్లాలో వాస్తవంగా కరెంటు సరఫరా, పంపిణీ నష్టాలు 7 శాతం మాత్రమే. కాళేశ్వరం ఎత్తిపోతల కరెంటు బిల్లు సొమ్మును ప్రభుత్వం నుంచి సరిగా రాకపోవడంతో నష్టాలు 37 శాతానికి చేరాయి.

అక్కడ విద్యుత్‌ సిబ్బందినే రానివ్వరు: ఏటీసీ నష్టాలు తగ్గకపోతే డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోతాయని గత కొంత కాలంగా కేంద్రం హెచ్చరిస్తోంది. నష్టాలను అధిగమించడానికి విద్యుత్‌ సర్కిళ్లవారీగా పంపిణీ, బిల్లుల వసూలు బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని గతంలోనే కేంద్రం విద్యుత్‌ నియమావళికి సవరణలు సైతం చేసింది. ఈ నేపథ్యంలోనే వీటిని పాతబస్తీ ప్రాంతంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

'విద్యుత్ కమిషన్​పై కేసీఆర్ పిటిషన్ - విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - TELANGANA HC ON KCR PE TITION

Loss making electricity circles: కరెంటు సరఫరా, పంపిణీ, వాణిజ్య (ATC) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా, హైదరాబాద్‌ దక్షిణ (సౌత్‌) విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాన్ని, అదానీ సంస్థకు అప్పగించబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే తెలిపారు. అందుకు సంబంధించి ఉన్నతస్థాయిలో సమావేశాలు జరిగాయి. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కంల నుంచి సమాచారం తీసుకుంది.

కరెంటు పంపిణీ, బిల్లుల వసూలను బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలంటే మెుదట రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇవ్వాలి. తర్వాత డిస్కంలు టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ, ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాతబస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాతబస్తీని అప్పగిస్తున్నందున, భవిష్యత్తులో నష్టాలొచ్చే ఇతర విద్యుత్‌ సర్కిళ్లకూ అదే విధానం వర్తిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘సౌత్‌’ సర్కిల్‌లో ఎక్కువగా: హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో అత్యధికంగా సుమారు 41.4 శాతం నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. దీని పరిధిలోని బార్కాస్‌ ఫీడర్‌లో ఏకంగా 90.7 శాతం నష్టాలు నమోదయ్యాయి. ఈ సర్కిల్‌లో పరిధిలో రోజూ రూ.మూడు కోట్ల విలువైన కరెంటు సరఫరా చేస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ. కోటిన్నర ఆదాయమే తిరిగి వస్తోంది. మిగతా కోటిన్నరను దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ (డిస్కం) నష్టాలుగా చూపెడుతుంది. ఈ ఒక్క సర్కిల్‌ నుంచే ఏటా రూ.500 కోట్లకు పైగా డిస్కం నష్టపోతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంల వార్షిక నష్టాలు రూ.5,500 కోట్లకు పైగా ఉన్నాయి. వాస్తవంగా సరఫరాలో సాంకేతిక సమస్యల వల్ల నష్టం సగటున 10-12 శాతం కాగా, విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేత వంటివే నష్టాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఎలాంటి ఉపయోగం లేదు - కమిషన్‌తో నిపుణులు వెల్లడి - Justice Narasimha Reddy Commission

దక్షిణ తెలంగాణ డిస్కం: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2022-23లో మొత్తం 55,155.92 మిలియన్‌ యూనిట్ల కరెంటు కొంటే, సరఫరా నష్టాలు పోను 51,242.69 మి.యూ. పంపిణీ చేశారు. ఈ పంపిణీలో చౌర్యం, బిల్లులు కట్టకపోవడం వంటి కారణాలతో చివరికి 46,887.55 మి.యూ.కి మాత్రమే బిల్లుల రూపంలో రాబడి వచ్చింది. 2022-23లో ఈ డిస్కం ఏటీసీ నష్టాలు 19.09 శాతంగా నమోదైతే.. పాతబస్తీలో నష్టాలు ఏకంగా 41 శాతం ఉన్నాయి.

ఉత్తర డిస్కం: ఉత్తర డిస్కం పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఏటీసీ నష్టాలు సంవత్సరం అత్యధికంగా 37 శాతం నమోదయ్యాయి. కానీ ఈ జిల్లాలో వాస్తవంగా కరెంటు సరఫరా, పంపిణీ నష్టాలు 7 శాతం మాత్రమే. కాళేశ్వరం ఎత్తిపోతల కరెంటు బిల్లు సొమ్మును ప్రభుత్వం నుంచి సరిగా రాకపోవడంతో నష్టాలు 37 శాతానికి చేరాయి.

అక్కడ విద్యుత్‌ సిబ్బందినే రానివ్వరు: ఏటీసీ నష్టాలు తగ్గకపోతే డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోతాయని గత కొంత కాలంగా కేంద్రం హెచ్చరిస్తోంది. నష్టాలను అధిగమించడానికి విద్యుత్‌ సర్కిళ్లవారీగా పంపిణీ, బిల్లుల వసూలు బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని గతంలోనే కేంద్రం విద్యుత్‌ నియమావళికి సవరణలు సైతం చేసింది. ఈ నేపథ్యంలోనే వీటిని పాతబస్తీ ప్రాంతంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

'విద్యుత్ కమిషన్​పై కేసీఆర్ పిటిషన్ - విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - TELANGANA HC ON KCR PE TITION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.