ETV Bharat / state

శ్రీవారి లడ్డూ కల్తీ, అవినీతి పాపాలు జగన్‌ను దహించబోతున్నాయి - TDP Leaders Fires on YS Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

TDP Leaders Fires on YS Jagan Mohan Reddy: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ , అవినీతి పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ ఛైర్మన్ చేసినందుకే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. తప్పు చేసిన బాధ కొంచమైన పార్టీలో వ్యక్తం కావడం లేదని మండిపడ్డారు.

TDP Leaders
TDP Leaders (ETV Bharat)

TDP Leaders Fires on YS Jagan Mohan Reddy: సీబీఐ ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ ఛైర్మన్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma Maheswara Rao) ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని హెచ్చరించారు. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్సల తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు.

జగన్నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామి వారి సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డి కుటుంబం స్తోత్రాలు పాడారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయాలని చూశాడో, అదే తరహాలో తిరుమలలో లడ్డూలో కూడా చేశారని ఆక్షేపించారు. పదివేల రూపాయల టికెట్లు పెట్టి ఆడిట్ లేకుండా ఎన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో అన్నిటిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ వేగవంతం చేయాలి భవిష్యత్తులో ఇలాంటి పాపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కల్తీ నెయ్యి ఘటనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ - YS Jagan Letter to PM Modi

TDP Buchi Ram Prasad On TTD Laddu: ఆగమ శాస్త్రం తెలిసినవారు జంతు కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూ (ప్రసాదం) దోషం ఎలా పోతుందో తెలపాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ కోరారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్రికెట్ బాల్​లా ఉండేదని, నేడు మెత్తగా పూర్తిగా నాణ్యమైన నెయ్యితో ఉంటోందని సంతోషం వ్యక్తంచేశారు. తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని తాము గతంలో అనేకసార్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చామని బుచ్చిరాం ప్రసాద్ ధ్వజమెత్తారు.

తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని చంద్రబాబు తెలిపితే ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు. నాన్ వెజ్ తిననివారు తెలియక తినేస్తే ఏం చేయాలో తెలుసుకొని సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రస్తుతం తిరుమల లడ్డూలో ఐదారు జీడిపప్పులు, కిస్ మిస్​లు, యాలకులు కలిగి ఉండటం చూస్తున్నామని తెలిపారు. పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా భార్య సమేతంగా టీటీడీకి వెళ్లారా అని నిలదీశారు. భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ నాయకులు అనేక తప్పులు చేశారని, వారిని వదలిపట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

TDP Pattabhi Ram Comments: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసత్యాలతో ప్రధాని మోదీకి జగన్‌రెడ్డి లేఖ రాయడం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. తప్పు చేసి కూడా కొంచమైనా బాధ లేకుండా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన AR కంపెనీకి టెండర్‌ ఖరారు చేసింది, కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది జగన్‌రెడ్డి హయాంలోనే అని గుర్తుచేశారు. జగన్ ఐదేళ్ల పాలన అవినీతితోనే సాగిందని హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీశారని చీరాల ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా శ్రీవారికి ప్రీతికరమైన లడ్డూ కల్తీ చేశారన్నారు.

తాడేపల్లిలో వైఎస్ జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ - BJP Agitation at YS Jagan House

TDP Leaders Fires on YS Jagan Mohan Reddy: సీబీఐ ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ ఛైర్మన్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma Maheswara Rao) ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని హెచ్చరించారు. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్సల తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు.

జగన్నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామి వారి సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డి కుటుంబం స్తోత్రాలు పాడారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయాలని చూశాడో, అదే తరహాలో తిరుమలలో లడ్డూలో కూడా చేశారని ఆక్షేపించారు. పదివేల రూపాయల టికెట్లు పెట్టి ఆడిట్ లేకుండా ఎన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో అన్నిటిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ వేగవంతం చేయాలి భవిష్యత్తులో ఇలాంటి పాపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కల్తీ నెయ్యి ఘటనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ - YS Jagan Letter to PM Modi

TDP Buchi Ram Prasad On TTD Laddu: ఆగమ శాస్త్రం తెలిసినవారు జంతు కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూ (ప్రసాదం) దోషం ఎలా పోతుందో తెలపాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ కోరారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్రికెట్ బాల్​లా ఉండేదని, నేడు మెత్తగా పూర్తిగా నాణ్యమైన నెయ్యితో ఉంటోందని సంతోషం వ్యక్తంచేశారు. తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని తాము గతంలో అనేకసార్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చామని బుచ్చిరాం ప్రసాద్ ధ్వజమెత్తారు.

తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని చంద్రబాబు తెలిపితే ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు. నాన్ వెజ్ తిననివారు తెలియక తినేస్తే ఏం చేయాలో తెలుసుకొని సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రస్తుతం తిరుమల లడ్డూలో ఐదారు జీడిపప్పులు, కిస్ మిస్​లు, యాలకులు కలిగి ఉండటం చూస్తున్నామని తెలిపారు. పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా భార్య సమేతంగా టీటీడీకి వెళ్లారా అని నిలదీశారు. భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ నాయకులు అనేక తప్పులు చేశారని, వారిని వదలిపట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

TDP Pattabhi Ram Comments: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసత్యాలతో ప్రధాని మోదీకి జగన్‌రెడ్డి లేఖ రాయడం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. తప్పు చేసి కూడా కొంచమైనా బాధ లేకుండా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన AR కంపెనీకి టెండర్‌ ఖరారు చేసింది, కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది జగన్‌రెడ్డి హయాంలోనే అని గుర్తుచేశారు. జగన్ ఐదేళ్ల పాలన అవినీతితోనే సాగిందని హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీశారని చీరాల ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా శ్రీవారికి ప్రీతికరమైన లడ్డూ కల్తీ చేశారన్నారు.

తాడేపల్లిలో వైఎస్ జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ - BJP Agitation at YS Jagan House

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.