ETV Bharat / state

ఓటుకు నోటు కేసు అప్డేట్ - విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు - SC on Note for Vote Case

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 12:07 PM IST

Updated : Aug 29, 2024, 12:34 PM IST

SC on Note for Vote Case Update : ఓటుకు నోటు కేసు ట్రయల్ బదిలీ చేయాలని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పిటిషన్​ను రద్దు చేసింది.

SC on Note for Vote Case
SC on Note for Vote Case (ETV Bharat)

Supreme Court on Note for Vote Case : ఓటుకు నోటు కేసు విచారణ​ను బదిలీ చేయాలని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గురువారం ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులోని నిందితుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఎసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే జగదీశ్​ రెడ్డి తరపు న్యాయవాది కోర్టకు వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్​నగర్​లో జరిగిన ర్యాలీల్లో పలు మార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని తెలిపారు.

సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్​లో కూడా వైఖరి మారిందని జగదీశ్​ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న సుప్రీంకోర్టు, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పిటిషన్​ను డిస్మిస్ చేస్తామని, తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ధర్మాసనం వెల్లడించింది.

Supreme Court on Note for Vote Case : ఓటుకు నోటు కేసు విచారణ​ను బదిలీ చేయాలని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గురువారం ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులోని నిందితుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఎసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే జగదీశ్​ రెడ్డి తరపు న్యాయవాది కోర్టకు వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్​నగర్​లో జరిగిన ర్యాలీల్లో పలు మార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని తెలిపారు.

సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్​లో కూడా వైఖరి మారిందని జగదీశ్​ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న సుప్రీంకోర్టు, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పిటిషన్​ను డిస్మిస్ చేస్తామని, తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ధర్మాసనం వెల్లడించింది.

Last Updated : Aug 29, 2024, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.