ETV Bharat / state

మేము ఈ కష్టాలు భరించలేము- గురుకుల హాస్టల్ ప్రహరీ గోడ దూకి 35 మంది విద్యార్థుల పరార్ - Students Ran Away from Gurukula

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Students Ran Away from Gurukula : గురుకుల పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, టీచర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ హాస్టల్‌ గోడ దూకి విద్యార్థులు పరారయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో చోటుచేసుకుంది. పారిపోయిన విద్యార్థులను చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్తించిన పోలీసులు, వారికి నచ్చజెప్పి తిరిగి పాఠశాలలో చేర్పించారు.

Students Ran Away from Gurukula
Palnadu Gurukula Incident (ETV Bharat)

Palnadu Gurukula Incident : కార్పోరేట్ పాఠశాలల తరహాలో అత్యాధునిక సౌకర్యాలు, ఉత్తమ ఉపాధ్యాయులచే బోధన, అన్నిరకాల వసతులతో కూడిన వసతిగృహాలు. నిరుపేదలైన పిల్లలను దృష్టిలో ఉంచుకుని, అక్షరాస్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఉభయ తెలుగురాష్ట్రాలలో ప్రభుత్వాలు గురుకుల పాఠశాలను ప్రారంభించాయి. కానీ నేడు వాటి లక్ష్యం నీరుగారిపోతోంది. అరకొర వసతులతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులు తమకు సౌకర్యాలు లేవంటూ రోడ్డెక్కుతుంటే, ఇప్పుడేమో ఏకంగా విద్యార్థులు గోడదూకి పరారయ్యారు.

వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం ప్రార్థన ముగియగానే పదో తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులందరూ సోలార్ ఫెన్సింగ్​తో ఉన్న గోడను దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే 27 మందిని పట్టుకున్నారు. మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారయిన విద్యార్థుల కోసం గాలించారు. 16వ నంబరు హైవే పక్కన ఉన్న తుమ్మపాలెం వద్ద పిల్లలను గుర్తించిన పోలీసులు వారిని గురుకులానికి తీసుకెళ్లారు.

అనంతరం నరసరావుపేట డీఎస్పీ, చిలుకలూరిపేట రూరల్‌ సీఐ విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఉపాధ్యాయులు వేధిస్తున్నట్లు ఆరోపించారు. సరైన ఆహారం, మంచి నీరు అందించడంలేదని వాపోయారు. తమకు ఆటలు ఆడుకునేందుకు అవకాశం కల్పించడంలేదని, పరీక్షలు పెడుతూ వేధిస్తున్నారని, ఉచిత విద్యకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ మాట్లాడుతూ నిజానిజాలను దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అప్పటివరకు విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, ఎవరి అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని తెలిపారు.

ఆ కళాశాలలో 150 విద్యార్థులకు ఒక్కటే టాయిలెట్​​ - ఇదీ మద్దూర్​ ప్రభుత్వ జూనియర్​ కాలేజీ దుస్థితి - lack of toilets in govt college

విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదా? : హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH REDDY

Palnadu Gurukula Incident : కార్పోరేట్ పాఠశాలల తరహాలో అత్యాధునిక సౌకర్యాలు, ఉత్తమ ఉపాధ్యాయులచే బోధన, అన్నిరకాల వసతులతో కూడిన వసతిగృహాలు. నిరుపేదలైన పిల్లలను దృష్టిలో ఉంచుకుని, అక్షరాస్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఉభయ తెలుగురాష్ట్రాలలో ప్రభుత్వాలు గురుకుల పాఠశాలను ప్రారంభించాయి. కానీ నేడు వాటి లక్ష్యం నీరుగారిపోతోంది. అరకొర వసతులతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులు తమకు సౌకర్యాలు లేవంటూ రోడ్డెక్కుతుంటే, ఇప్పుడేమో ఏకంగా విద్యార్థులు గోడదూకి పరారయ్యారు.

వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం ప్రార్థన ముగియగానే పదో తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులందరూ సోలార్ ఫెన్సింగ్​తో ఉన్న గోడను దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే 27 మందిని పట్టుకున్నారు. మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారయిన విద్యార్థుల కోసం గాలించారు. 16వ నంబరు హైవే పక్కన ఉన్న తుమ్మపాలెం వద్ద పిల్లలను గుర్తించిన పోలీసులు వారిని గురుకులానికి తీసుకెళ్లారు.

అనంతరం నరసరావుపేట డీఎస్పీ, చిలుకలూరిపేట రూరల్‌ సీఐ విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఉపాధ్యాయులు వేధిస్తున్నట్లు ఆరోపించారు. సరైన ఆహారం, మంచి నీరు అందించడంలేదని వాపోయారు. తమకు ఆటలు ఆడుకునేందుకు అవకాశం కల్పించడంలేదని, పరీక్షలు పెడుతూ వేధిస్తున్నారని, ఉచిత విద్యకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ మాట్లాడుతూ నిజానిజాలను దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అప్పటివరకు విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, ఎవరి అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని తెలిపారు.

ఆ కళాశాలలో 150 విద్యార్థులకు ఒక్కటే టాయిలెట్​​ - ఇదీ మద్దూర్​ ప్రభుత్వ జూనియర్​ కాలేజీ దుస్థితి - lack of toilets in govt college

విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదా? : హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH REDDY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.