ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం - 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Dam Gates Lifted

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 12:32 PM IST

Updated : Jul 30, 2024, 10:42 PM IST

Srisailam Dam Gates Opened 2024 : శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 2.75 లక్షల క్యూసెక్కు సాగర్​లోకి వదులుతున్నారు.

Srisailam Project Gates Lifted
Srisailam Project Gates Lifted (ETV Bharat)

Srisailam Project 10 Gates Lifted : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి కొద్ది రోజుల నుంచి పోటెత్తుతోన్న వరద క్రమంగా తగ్గుతోంది. వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు 10 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.9 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.59 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతుంది.

విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని సాగర్​కు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35 వేల 315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1600 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 21 వేల 432 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నాగార్జునసాగర్​ దిశగా కృష్ణమ్మ పరుగులు - శ్రీశైలం ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్ల ఎత్తివేత - Srisailam Project Gates Lifted

రాత్రి పూట ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలో ప్రాజెక్టు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Srisailam Project 10 Gates Lifted : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి కొద్ది రోజుల నుంచి పోటెత్తుతోన్న వరద క్రమంగా తగ్గుతోంది. వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు 10 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.9 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.59 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతుంది.

విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని సాగర్​కు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35 వేల 315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1600 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 21 వేల 432 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నాగార్జునసాగర్​ దిశగా కృష్ణమ్మ పరుగులు - శ్రీశైలం ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్ల ఎత్తివేత - Srisailam Project Gates Lifted

రాత్రి పూట ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలో ప్రాజెక్టు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Last Updated : Jul 30, 2024, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.