Revenue Department Special CS orders: రెవెన్యూ శాఖలో దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాల్లో వెల్లడించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించారు. దీంతో పాటు బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు వెలువరించారు. మంత్రుల పెషిలల్లోని దస్త్రాలను, ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని ఆయా ఓఎస్డీలకు ఆదేశాలు వెలువరించారు.
'ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దు- నిధుల విడుదల నిలిపేయండి' - Revenue Department orders
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 5, 2024, 5:36 PM IST
|Updated : Jun 5, 2024, 6:10 PM IST
Revenue Department Special CS orders: రెవెన్యూ శాఖలో దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని స్పెషల్ సీఎస్ పేర్కొన్నారు. గుత్తేదారులకు నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచన చేశారు.
!['ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దు- నిధుల విడుదల నిలిపేయండి' - Revenue Department orders Revenue Department Special CS orders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-06-2024/1200-675-21644490-thumbnail-16x9-revenue.jpg?imwidth=3840)
Revenue Department Special CS orders: రెవెన్యూ శాఖలో దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాల్లో వెల్లడించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించారు. దీంతో పాటు బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు వెలువరించారు. మంత్రుల పెషిలల్లోని దస్త్రాలను, ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని ఆయా ఓఎస్డీలకు ఆదేశాలు వెలువరించారు.