ETV Bharat / state

హైదరాబాద్-విజయవాడ మధ్య రైళ్లు రద్దు- బస్సుల్లో ప్రయాణికులను తరలించేందుకు అధికారుల యత్నం - Trains Cancelled in Rains

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 1:21 PM IST

Updated : Sep 1, 2024, 1:36 PM IST

SCR Cancelled Trains : భారీ వర్షాలతో కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో హైదరాబాద్ -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్లు రద్దు కావడంతో దూరం వెళ్లే ప్రయాణికులు పలు స్టేషన్లో చిక్కుకుపోయారు. దీంతో ప్రయాణికులను బస్సుల్లో తరలించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.

Trains Cancelled in Rains
Trains Cancelled in Rains (ETV Bharat)

Trains Cancelled in Rains : తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ -సికింద్రాబాద్, గుంటూరు- సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యయి.

Hyderabad Vijayawada Trains Cancelled : ఇప్పటి వరకు సుమారు 30 రైళ్లు రద్దు కాగా 25 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను విజయవాడ, గుంటూరు, నల్గొండ, పగిడిపల్లి మీదుగా దారి మళ్లించామని చెప్పారు రద్దైన, దారిమళ్లించి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ వెబ్​సైట్​లో పొందుపరిచామని పేర్కొన్నారు. ప్రయాణికుల సహాయం కోసం రైల్వేస్టేషన్లలో హెల్ప్​లైన్లు నంబర్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.

Railway Track damage in Telangana : ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే రైళ్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి స్టేషన్లో వేచి చూడాల్సి వస్తోందని వారు అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ మీదుగా హైదరాబాద్ వెళ్లేలా ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ వద్ద విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశారు. శనివారం అర్ధరాత్రి 2:30 గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాయనపాడు వద్ద ట్రాక్ పైకి వరద నీరు : విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. రైళ్ల నిలిపివేతతో 50 బస్సుల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు. వారిని విజయవాడ స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి విశాఖ, చెన్నైకి ప్రత్యేక రైళ్లలో పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.


హెల్ప్ లైన్ నంబర్స్

  • హైదరాబాద్ : 27781500
  • సికింద్రాబాద్ : 27786140, 27786170
  • కాజీపేట : 27782660,8702576430
  • వరంగల్ : 27782751
  • ఖమ్మం : 27782985,08742-224541,7815955306
  • విజయవాడ : 7569305697
  • రాజమండ్రి : 0883-2420541,0883-2420543

ప్రయాణికులకు అలర్ట్ - ఆగస్టు 5 నుంచి 11 వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు - Trains Cancel Vijayawada Division

47 రోజులపాటు ఆ మూడు రైళ్లు రద్దు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు - trains cancelled

Trains Cancelled in Rains : తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ -సికింద్రాబాద్, గుంటూరు- సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యయి.

Hyderabad Vijayawada Trains Cancelled : ఇప్పటి వరకు సుమారు 30 రైళ్లు రద్దు కాగా 25 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను విజయవాడ, గుంటూరు, నల్గొండ, పగిడిపల్లి మీదుగా దారి మళ్లించామని చెప్పారు రద్దైన, దారిమళ్లించి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ వెబ్​సైట్​లో పొందుపరిచామని పేర్కొన్నారు. ప్రయాణికుల సహాయం కోసం రైల్వేస్టేషన్లలో హెల్ప్​లైన్లు నంబర్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.

Railway Track damage in Telangana : ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే రైళ్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి స్టేషన్లో వేచి చూడాల్సి వస్తోందని వారు అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ మీదుగా హైదరాబాద్ వెళ్లేలా ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ వద్ద విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశారు. శనివారం అర్ధరాత్రి 2:30 గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాయనపాడు వద్ద ట్రాక్ పైకి వరద నీరు : విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. రైళ్ల నిలిపివేతతో 50 బస్సుల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు. వారిని విజయవాడ స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి విశాఖ, చెన్నైకి ప్రత్యేక రైళ్లలో పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.


హెల్ప్ లైన్ నంబర్స్

  • హైదరాబాద్ : 27781500
  • సికింద్రాబాద్ : 27786140, 27786170
  • కాజీపేట : 27782660,8702576430
  • వరంగల్ : 27782751
  • ఖమ్మం : 27782985,08742-224541,7815955306
  • విజయవాడ : 7569305697
  • రాజమండ్రి : 0883-2420541,0883-2420543

ప్రయాణికులకు అలర్ట్ - ఆగస్టు 5 నుంచి 11 వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు - Trains Cancel Vijayawada Division

47 రోజులపాటు ఆ మూడు రైళ్లు రద్దు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు - trains cancelled

Last Updated : Sep 1, 2024, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.