Encounter in Mulugu District : తెలంగాణలోని ములుగు జిల్లా తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లింది. ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే ఎన్కౌంటర్పై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో బద్రు(35), మధు(43), కరుణాకర్(22), జైసింగ్(25), కిషోర్(22), కామేశ్(23), జమున(23) మృతి చెందినట్లు సమాచారం.