ETV Bharat / state

ఏపీలో భారీ వర్షాలు - రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

విపత్తుల నివారణపై టీటీడీ సమావేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

AP HEAVY RAINS
AP HEAVY RAINS (ETV Bharat)

School Holidays in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్​.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు. 2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. ఈ ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు శ్యామలరావు సూచించారు.

TTD on Heavy Rains in AP : ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందని శ్యామలరావు వివరించారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్​మెంట్​​ రెస్పాన్స్​ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో సూచించారు.

కరెంట్​కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని శ్యామలరావు తెలిపారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యశాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని శ్యామలరావు వెల్లడించారు.

Heavy Rain in Tirumala : ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని, ఘాట్ రోడ్డుల్లో జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకుని సమాయత్తంగా ఉండాలని శ్యామలరావు ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర విభాగాధిపతులు, జిల్లా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం - ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

'బీ అలర్ట్' - విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు - విద్యాసంస్థలకు సెలవులు

School Holidays in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్​.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు. 2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. ఈ ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు శ్యామలరావు సూచించారు.

TTD on Heavy Rains in AP : ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందని శ్యామలరావు వివరించారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్​మెంట్​​ రెస్పాన్స్​ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో సూచించారు.

కరెంట్​కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని శ్యామలరావు తెలిపారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యశాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని శ్యామలరావు వెల్లడించారు.

Heavy Rain in Tirumala : ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని, ఘాట్ రోడ్డుల్లో జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకుని సమాయత్తంగా ఉండాలని శ్యామలరావు ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర విభాగాధిపతులు, జిల్లా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం - ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

'బీ అలర్ట్' - విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు - విద్యాసంస్థలకు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.