దిల్లీ మద్యం సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు - kavitha judicial Custody - KAVITHA JUDICIAL CUSTODY
kavitha judicial Custody : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. కవిత రిమాండ్ను మరోసారి పొడిగించాల్సిందిగా ఈడీ, సీబీఐ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది.


Published : May 20, 2024, 2:29 PM IST
|Updated : May 20, 2024, 5:59 PM IST
kavitha judicial Custody Extended : దిల్లీ మద్యం విధానంలో తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పెరిగింది. జూన్ 3 వరకు కవిత రిమాండ్ను పొడిగిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఇప్పటికే ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు జూన్ మూడో తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది.
దిల్లీ మద్యం విధానం కేసులో కవిత సహా నలుగురిపై దాఖలు చేసిన ఛార్జిషీట్పై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి. ఐదుగురు నిందితుల పాత్రపై ఆధారాలు పొందుపరిచామని కోర్టులో ఈడీ పేర్కొంది. కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్తో పాటు మరో ఇద్దరిపై ఏడో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు వివరించింది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమవ్వగా ఆమె పాత్ర మినహా మిగతా నలుగురి పాత్ర గురించి వివరించాలని జడ్జి ఆదేశించారు.
MLC Kavitha Judicial Custody : ఈ నెల 14న కూడా ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా అధికారులు తిహాడ్ జైలు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరపరిచారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కవిత కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది. ఆదేరోజు ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో దామోదర్ శర్మ, ప్రిన్స్కుమార్, చన్ప్రీత్ సింగ్తోపాటు, ఇండియా ఎహెడ్ వార్తా ఛానల్ మాజీ ఉద్యోగి అర్వింద్సింగ్లనూ నిందితులుగా చేర్చింది.
దిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. జ్యుడిషల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహాడ్ జైల్లో ఉంచారు. జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్లో కొనసాగుతున్నారు. కేసు విచారణ జరుగుతున్నందున ఆమె బయట ఉండే సాక్ష్యాలను తప్పుదోవపెట్టే అవకాశం ఉంటుందని కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవొద్దంటూ ఈడీ పిటిషన్లు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో న్యాయస్థానం కూడా కవిత కస్టడీని పొడిగిస్తూ వస్తోంది.