ETV Bharat / state

బాపట్ల జిల్లాలో భారీ చోరీ - లారీని అడ్డగించి వ్యాపారి నుంచి రూ.39 లక్షలు అపహరణ

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు - బెదిరించి నగదు అపహరణ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

Robbery in Bapatla District
Robbery in Bapatla District (ETV Bharat)

Robbery in Bapatla District: బాపట్ల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ బంగారు నగల వ్యాపారిని దారిలో అడ్డగించి రూ.39.50 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కొరిశపాడు మండలం పిచ్చికల గడిపాడు దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన వ్యాపారి స్వరూప్​ నగల కొనుగోలు కోసం గుంటూరు నుంచి చెన్నై బయల్దేరాడు. గుంటూరు నుంచి వెంకటరమణ గూడ్స్​ ట్రావెల్స్​ లారీలో చెన్నై వెళ్తున్నాడు. ఈలోగా పిచ్చికల గడిపాడు దగ్గర దుండగులు వ్యాపారి ప్రయాణిస్తున్న లారీని అడ్డుకున్నారు. స్వరూప్​ దగ్గర ఉన్న రూ.39.50 లక్షలు లాక్కొని పరారయ్యారు. అయితే ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగగా వ్యాపారి ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఘటన వెలుగు చూసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నగరంపై ధార్ గ్యాంగ్ కన్ను - దోపిడీకి ముందు వీళ్లు ఏం చేస్తారంటే!

Robbery in Bapatla District: బాపట్ల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ బంగారు నగల వ్యాపారిని దారిలో అడ్డగించి రూ.39.50 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కొరిశపాడు మండలం పిచ్చికల గడిపాడు దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన వ్యాపారి స్వరూప్​ నగల కొనుగోలు కోసం గుంటూరు నుంచి చెన్నై బయల్దేరాడు. గుంటూరు నుంచి వెంకటరమణ గూడ్స్​ ట్రావెల్స్​ లారీలో చెన్నై వెళ్తున్నాడు. ఈలోగా పిచ్చికల గడిపాడు దగ్గర దుండగులు వ్యాపారి ప్రయాణిస్తున్న లారీని అడ్డుకున్నారు. స్వరూప్​ దగ్గర ఉన్న రూ.39.50 లక్షలు లాక్కొని పరారయ్యారు. అయితే ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగగా వ్యాపారి ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఘటన వెలుగు చూసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నగరంపై ధార్ గ్యాంగ్ కన్ను - దోపిడీకి ముందు వీళ్లు ఏం చేస్తారంటే!

నిద్రలేచే సరికి 3.5 కిలోల బంగారు ఆభరణాల బ్యాగ్ మాయం

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.