ETV Bharat / state

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురి మృతి - Road Accident in Eluru District

Road Accident in Eluru District Today : ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 7:26 AM IST

Updated : Jul 8, 2024, 10:19 AM IST

Road Accident in Eluru District
Road Accident in Eluru District (ETV Bharat)

Dwaraka Tirumala Road Accident Today : ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Road Accident in Eluru District : పోలీసులు, స్థానికులు కష్టపడి మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు, నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజవోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి, ఈనెల 6న సాఫ్ట్​వేర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్​కు కారులో వెళ్లిందని పోలీసులు వివరించారు.

తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో, ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్​ను కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగ నితిన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారని చెప్పారు. డ్రైవర్ దుర్గావంశీ, భాగ్యశ్రీ చిన్న కుమారుడు నాగ షణ్ముక్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. బాధితులను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఘటనా స్థలాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Dwaraka Tirumala Road Accident Today : ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Road Accident in Eluru District : పోలీసులు, స్థానికులు కష్టపడి మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు, నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజవోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి, ఈనెల 6న సాఫ్ట్​వేర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్​కు కారులో వెళ్లిందని పోలీసులు వివరించారు.

తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో, ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్​ను కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగ నితిన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారని చెప్పారు. డ్రైవర్ దుర్గావంశీ, భాగ్యశ్రీ చిన్న కుమారుడు నాగ షణ్ముక్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. బాధితులను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఘటనా స్థలాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అంబటివలసలో ద్విచక్ర వాహనాలు ఢీ - ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - Two People Dead in Accident

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - road accident in Eluru district

Last Updated : Jul 8, 2024, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.