ETV Bharat / state

చిమ్మచీకటిలో సాహసం, రాళ్లవాగులో చిక్కుకుపోయిన నలుగురిని కాపాడిన ఎన్డీఆర్​ఎఫ్ - man missed in Vagu

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 5:27 PM IST

Man Missed in Ralla Vagu : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రాళ్లవాగు వరద ఉద్ధృతిలో డీసీఏం వ్యాన్ కొట్టుకు పోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోగా ఎన్డీఆర్​ఎఫ్​ టీమ్ 5 గంటల పాటు శ్రమించి అందులో నలుగురిని రక్షించింది. ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు.

DCM washed away in Ralla Vagu
Man Missed in Ralla Vagu (ETV Bharat)

DCM washed away in Ralla Vagu : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా కేంద్రం శివారులోని రాళ్లవాగులో వరద ఉద్ధృతి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ఈ విషయం తెలియక రాళ్లవాగు ఉద్ధృతి కల్వర్టుపై నుంచి వెళ్లిన డీసీఎం వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోగా పోలీస్, రెస్క్యూ టీమ్ సిబ్బంది నలుగురిని కాపాడారు. ఒకరు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.

'డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారు. ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్​ఎఫ్ టీమ్​తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నారు'- తిరుపతి, మహబూబాబాద్ డీఎస్పీ

పట్టుతప్పి వరద ప్రవాహంలో గల్లంతు : డీసీఎం వాహనం రంగారెడ్డి జిల్లా కొంపెల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రికి చెందిన నాగభూషణం, సునీల్, గుంటూరుకు చెందిన వేణు, కోటయ్య, మహబూబాబాద్​కు చెందిన దుర్గప్రసాద్ వ్యాన్లో ప్రయాణం చేస్తూ వరద ఉద్ధృతికి కొట్టుకు పోయారు.

విషయం తెలుసుకున్న పోలీస్, రెస్క్యూ టీమ్ సిబ్బంది, ఎన్డీఆర్​ఎఫ్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు, ట్యూబ్లతో వ్యాన్ వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్​ను పట్టుకొని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టుతప్పి వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. మిగతా నలుగురిని ఎన్డీఆర్​ఎఫ్ సభ్యులు స్పీడ్​ బోట్​లో వెళ్లి రక్షించారు.

'హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకొన్న మిగతా నలుగురిని 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. జిల్లాలో సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చాలామటుకు వాగులన్నీ ఓవర్ ఫ్లో అయ్యాయి. రాళ్లవాగు కూడా ప్రమాదకరంగా మారింది. అందులో ఓ డీసీఎం చిక్కుకుపోయింది. అందులో ఉన్న నలుగురిని కాపాడం, మరొకరి కోసం గాల్లింపు చర్యలు సాగుతున్నాయి'- డేవిడ్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు - వరదలకు కొట్టుకుపోయి ఐదుగురు మృతి - Five People Died Due to Rains

DCM washed away in Ralla Vagu : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా కేంద్రం శివారులోని రాళ్లవాగులో వరద ఉద్ధృతి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ఈ విషయం తెలియక రాళ్లవాగు ఉద్ధృతి కల్వర్టుపై నుంచి వెళ్లిన డీసీఎం వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోగా పోలీస్, రెస్క్యూ టీమ్ సిబ్బంది నలుగురిని కాపాడారు. ఒకరు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.

'డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారు. ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్​ఎఫ్ టీమ్​తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నారు'- తిరుపతి, మహబూబాబాద్ డీఎస్పీ

పట్టుతప్పి వరద ప్రవాహంలో గల్లంతు : డీసీఎం వాహనం రంగారెడ్డి జిల్లా కొంపెల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రికి చెందిన నాగభూషణం, సునీల్, గుంటూరుకు చెందిన వేణు, కోటయ్య, మహబూబాబాద్​కు చెందిన దుర్గప్రసాద్ వ్యాన్లో ప్రయాణం చేస్తూ వరద ఉద్ధృతికి కొట్టుకు పోయారు.

విషయం తెలుసుకున్న పోలీస్, రెస్క్యూ టీమ్ సిబ్బంది, ఎన్డీఆర్​ఎఫ్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు, ట్యూబ్లతో వ్యాన్ వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్​ను పట్టుకొని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టుతప్పి వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. మిగతా నలుగురిని ఎన్డీఆర్​ఎఫ్ సభ్యులు స్పీడ్​ బోట్​లో వెళ్లి రక్షించారు.

'హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకొన్న మిగతా నలుగురిని 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. జిల్లాలో సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చాలామటుకు వాగులన్నీ ఓవర్ ఫ్లో అయ్యాయి. రాళ్లవాగు కూడా ప్రమాదకరంగా మారింది. అందులో ఓ డీసీఎం చిక్కుకుపోయింది. అందులో ఉన్న నలుగురిని కాపాడం, మరొకరి కోసం గాల్లింపు చర్యలు సాగుతున్నాయి'- డేవిడ్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు - వరదలకు కొట్టుకుపోయి ఐదుగురు మృతి - Five People Died Due to Rains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.