ETV Bharat / state

కాటేస్తోన్న క్వార్ట్‌జైట్‌ మైనింగ్ - అవాస్తవాలతో 'షిర్జీసాయి' రిపోర్ట్ - అడ్డుకుంటామంటున్న స్థానికులు - Quartzite Mining Affecting Health

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 7:54 AM IST

Quartzite Mining Affecting Public Health: ఆ ఖనిజాన్ని వెలికి తీయటం వల్ల యజమానులకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పర్యావరణం దెబ్బతింటుంది. అలాంటి ఎంతో ప్రమాదకరమైన క్వార్ట్ జైట్ ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు మాజీ సీఎం జగన్‌ అస్మదీయ సంస్థ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ముందుకు రావడాన్ని కర్నూలు జిల్లావాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Quartzite Mining
Quartzite Mining (ETV Bharat)

Quartzite Mining Affecting Public Health: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో క్వార్ట్ జైట్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ ఖనిజానికి మార్కెట్​లో ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిని తవ్వుకుని ఎంతో మంది కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో పదికి పైగా ఇలాంటి మైనింగ్​లు ఉన్నాయి. ఇందులో పనిచేసే కార్మికులు ఇప్పటికే 20 మందికి పైగా మరణించారు. దీంతో స్థానిక ప్రజలు పనికి వెళ్లటం మానేశారు. దీంతో పలు మైనింగ్​లు మూతపడ్డాయి. ప్రస్తుతం 3 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలోనూ ఇతర రాష్ట్రాల వారు మాత్రమే పని చేస్తున్నారు. కానీ ఓర్వకల్లులో క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ కోసం సమర్పించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలు కాలుష్యాన్ని కప్పిపుచ్చేలా, ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయి.

క్వార్ట్‌జైట్‌ తవ్వకాలు, రవాణాతో వెలువడే ధూళి కాలుష్య మోతాదును ఈ నివేదికల్లో కనీస స్థాయిలో చూపించారు. ఆ గణాంకాలను ఎలా లెక్కించారో స్పష్టతివ్వలేదు. ఈ గనుల్లో పనిచేసే కార్మికులపై మైనింగ్ నుంచి వచ్చే ధూళి ప్రభావం ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. వాస్తవానికి, క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌తో చెలరేగే ధూళిలో 90 శాతానికిపైగా సిలికాన్‌ డై ఆక్సైడ్‌ ఉంటుంది. ఇది కార్మికుల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతుంది. ఈఐఏఆర్‌లో మాత్రం క్వార్ట్‌జైట్‌ కాంపోజిషన్‌ వివరాలే ఇవ్వలేదు.

ఈ మైనింగ్‌ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ, అరకొర సమాచారంతో షిర్డీసాయి సంస్థ నివేదికలు సమర్పించగా, కాలుష్య నియంత్రణ మండలి వాటినే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. వీటి ఆధారంగానే సెప్టెంబరు 6వ తేదీన ఓర్వకల్లులో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో ఓర్వకల్లులోని 42.05 హెక్టార్లలో మూడు క్వార్ట్‌జైట్‌ గనుల లీజుల్ని 20 ఏళ్ల కాలపరిమితితో షిర్డీసాయి సంస్థ దక్కించుకుంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్‌ అక్రమాలు - కొనసాగుతున్న విచారణ - Illegal Minerals Mining in AP

క్వార్ట్‌జైట్‌ గనుల్లో పనిచేసేవారు సిలికోసిస్‌ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. తెలంగాణలోని షాద్‌నగర్‌లో గతంలో క్వార్ట్‌జైట్‌ గనిలో పనిచేసిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. దేవరకొండలోనూ పదుల సంఖ్యలో మరణించారు. ఉబ్బసం, శ్వాసకోస సమస్యలు, బ్రాంకైటీస్‌ వంటి వ్యాధుల బారిన పడ్డవారు వందల మంది ఉన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి ప్రకటనతో ఓర్వకల్లు గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మైనిగ్ వల్ల తమ ప్రాణాలు పోతాయని, దీనిని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే తమ ఆరోగ్యాలు పాడైపోయాయని బాధితులు చెబుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

"ఓర్వకల్లులో ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వారు పదిమందికి పైగా చనిపోయి ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అటువంటి క్వారీలో నేను పనిచేశాను. అవి వద్దు అనుకుని, వ్యవసాయ పనిచేసుకుంటున్నాను. కాబట్టి ఆ మైనింగ్​ను అడ్డుకుంటాము". - మాదన్న, బాధితుడు, ఓర్వకల్లు

ఏపీలో గనుల దోపిడీపై సీఐడీ దర్యాప్తు - క్వార్ట్జ్, సిలికాశాండ్‌ అక్రమాలపైనా విచారణ? - CID Inquiry on Illegal Mining

Quartzite Mining Affecting Public Health: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో క్వార్ట్ జైట్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ ఖనిజానికి మార్కెట్​లో ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిని తవ్వుకుని ఎంతో మంది కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో పదికి పైగా ఇలాంటి మైనింగ్​లు ఉన్నాయి. ఇందులో పనిచేసే కార్మికులు ఇప్పటికే 20 మందికి పైగా మరణించారు. దీంతో స్థానిక ప్రజలు పనికి వెళ్లటం మానేశారు. దీంతో పలు మైనింగ్​లు మూతపడ్డాయి. ప్రస్తుతం 3 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలోనూ ఇతర రాష్ట్రాల వారు మాత్రమే పని చేస్తున్నారు. కానీ ఓర్వకల్లులో క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ కోసం సమర్పించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలు కాలుష్యాన్ని కప్పిపుచ్చేలా, ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయి.

క్వార్ట్‌జైట్‌ తవ్వకాలు, రవాణాతో వెలువడే ధూళి కాలుష్య మోతాదును ఈ నివేదికల్లో కనీస స్థాయిలో చూపించారు. ఆ గణాంకాలను ఎలా లెక్కించారో స్పష్టతివ్వలేదు. ఈ గనుల్లో పనిచేసే కార్మికులపై మైనింగ్ నుంచి వచ్చే ధూళి ప్రభావం ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. వాస్తవానికి, క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌తో చెలరేగే ధూళిలో 90 శాతానికిపైగా సిలికాన్‌ డై ఆక్సైడ్‌ ఉంటుంది. ఇది కార్మికుల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతుంది. ఈఐఏఆర్‌లో మాత్రం క్వార్ట్‌జైట్‌ కాంపోజిషన్‌ వివరాలే ఇవ్వలేదు.

ఈ మైనింగ్‌ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ, అరకొర సమాచారంతో షిర్డీసాయి సంస్థ నివేదికలు సమర్పించగా, కాలుష్య నియంత్రణ మండలి వాటినే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. వీటి ఆధారంగానే సెప్టెంబరు 6వ తేదీన ఓర్వకల్లులో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో ఓర్వకల్లులోని 42.05 హెక్టార్లలో మూడు క్వార్ట్‌జైట్‌ గనుల లీజుల్ని 20 ఏళ్ల కాలపరిమితితో షిర్డీసాయి సంస్థ దక్కించుకుంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్‌ అక్రమాలు - కొనసాగుతున్న విచారణ - Illegal Minerals Mining in AP

క్వార్ట్‌జైట్‌ గనుల్లో పనిచేసేవారు సిలికోసిస్‌ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. తెలంగాణలోని షాద్‌నగర్‌లో గతంలో క్వార్ట్‌జైట్‌ గనిలో పనిచేసిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. దేవరకొండలోనూ పదుల సంఖ్యలో మరణించారు. ఉబ్బసం, శ్వాసకోస సమస్యలు, బ్రాంకైటీస్‌ వంటి వ్యాధుల బారిన పడ్డవారు వందల మంది ఉన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి ప్రకటనతో ఓర్వకల్లు గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మైనిగ్ వల్ల తమ ప్రాణాలు పోతాయని, దీనిని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే తమ ఆరోగ్యాలు పాడైపోయాయని బాధితులు చెబుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

"ఓర్వకల్లులో ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వారు పదిమందికి పైగా చనిపోయి ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అటువంటి క్వారీలో నేను పనిచేశాను. అవి వద్దు అనుకుని, వ్యవసాయ పనిచేసుకుంటున్నాను. కాబట్టి ఆ మైనింగ్​ను అడ్డుకుంటాము". - మాదన్న, బాధితుడు, ఓర్వకల్లు

ఏపీలో గనుల దోపిడీపై సీఐడీ దర్యాప్తు - క్వార్ట్జ్, సిలికాశాండ్‌ అక్రమాలపైనా విచారణ? - CID Inquiry on Illegal Mining

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.