ETV Bharat / state

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు - తిరిగి ప్రారంభమైన విచారణ - YS VIVEKA MURDER CASE

వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల పీఎస్‌లో విచారణ - ఈ కేసుపై తిరిగి విచారణ ప్రారంభం

YS Viveka Murder Case
YS Viveka Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 2:17 PM IST

Police Inquiry on Viveka PA Compliant : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేసిన విషయం తెలిపిందే. ఈ కేసుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సందర్భంలో సాక్షులుగా ఉన్న పలువురికి పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే నోటీసులు అందుకున్న ఆరుగురు ఇవాళ డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వారిలో ప్రధానంగా జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్​రెడ్డి, వైఎస్సార్సీపీ తరపు న్యాయవాది ఓబుల్​రెడ్డి, కృష్ణారెడ్డి కుమారుడు రాజేశ్​కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే రఘునాథ్​రెడ్డి, ఆ పార్టీ కార్యకర్త భరత్​యాదవ్, వీఆర్వో మహేశ్వర్​రెడ్డి హాజరయ్యారు.

గతేడాది డిసెంబర్ 15న సునీత దంపతులు, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైన కేసు నమోదైంది. ఈ అంశంపై తిరిగి ఫైనల్ ఛార్జిషీట్​ పులివెందుల కోర్టులో దాఖలు చేయడానికి పోలీసులు పలువురు సాక్షులను విచారిస్తున్నారు. అయితే మరో నలుగురు విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిలో వైఎస్ మనోహర్​రెడ్డి, వైఎస్ అభిషేక్​రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డిని రెండు వారాల కిందటే డీఎస్పీ విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. ఇవాళ మరోసారి ఆయన డీఎస్పీని కలిసి వెళ్లారు.

YS Viveka Murder Case Updates : డీఎస్పీ మురళీ నాయక్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు న్యాయవాది ఓబుల్​రెడ్డి మీడియాకు వెల్లడించారు. గతంలో దర్యాప్తు సంస్థలను ఏ ప్రశ్నలు అడిగారో వాటిని మళ్లీ అడిగినట్లు చెప్పారు. వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చినట్లు తెలిపారు. వాటన్నింటిని ఆడియో, వీడియో రికార్డ్ చేశారని తెలిపారు. తనకు తెలిసిన విషయాలను డీఎస్పీకి చెప్పానని న్యాయవాది ఓబుల్​రెడ్డి వెల్లడించారు.

వివేకా హత్య కేసులో కదలిక - ప్రభుత్వ ఆదేశాలతో పోలీసుల విచారణ

వైఎస్ వివేకా పీఏ ఇంటికి పోలీసులు - వాంగ్మూలం నమోదు

Police Inquiry on Viveka PA Compliant : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేసిన విషయం తెలిపిందే. ఈ కేసుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సందర్భంలో సాక్షులుగా ఉన్న పలువురికి పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే నోటీసులు అందుకున్న ఆరుగురు ఇవాళ డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వారిలో ప్రధానంగా జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్​రెడ్డి, వైఎస్సార్సీపీ తరపు న్యాయవాది ఓబుల్​రెడ్డి, కృష్ణారెడ్డి కుమారుడు రాజేశ్​కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే రఘునాథ్​రెడ్డి, ఆ పార్టీ కార్యకర్త భరత్​యాదవ్, వీఆర్వో మహేశ్వర్​రెడ్డి హాజరయ్యారు.

గతేడాది డిసెంబర్ 15న సునీత దంపతులు, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైన కేసు నమోదైంది. ఈ అంశంపై తిరిగి ఫైనల్ ఛార్జిషీట్​ పులివెందుల కోర్టులో దాఖలు చేయడానికి పోలీసులు పలువురు సాక్షులను విచారిస్తున్నారు. అయితే మరో నలుగురు విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిలో వైఎస్ మనోహర్​రెడ్డి, వైఎస్ అభిషేక్​రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డిని రెండు వారాల కిందటే డీఎస్పీ విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. ఇవాళ మరోసారి ఆయన డీఎస్పీని కలిసి వెళ్లారు.

YS Viveka Murder Case Updates : డీఎస్పీ మురళీ నాయక్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు న్యాయవాది ఓబుల్​రెడ్డి మీడియాకు వెల్లడించారు. గతంలో దర్యాప్తు సంస్థలను ఏ ప్రశ్నలు అడిగారో వాటిని మళ్లీ అడిగినట్లు చెప్పారు. వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చినట్లు తెలిపారు. వాటన్నింటిని ఆడియో, వీడియో రికార్డ్ చేశారని తెలిపారు. తనకు తెలిసిన విషయాలను డీఎస్పీకి చెప్పానని న్యాయవాది ఓబుల్​రెడ్డి వెల్లడించారు.

వివేకా హత్య కేసులో కదలిక - ప్రభుత్వ ఆదేశాలతో పోలీసుల విచారణ

వైఎస్ వివేకా పీఏ ఇంటికి పోలీసులు - వాంగ్మూలం నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.