ETV Bharat / state

హూ కిల్డ్​ బాబాయ్ - నేటి వరకు దొరకని సమాధానం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 4:34 PM IST

Prathidwani : అయిదేళ్లుగా హూ కిల్డ్​ బాబాయ్​ ప్రశ్నకు నేటి వరకు సమాధానం దొరకలేదు. వివేకా హత్యకేసు విచారణలో క్రైమ్‌ థ్రిల్లర్​ను తలదన్నే మలుపులు వస్తున్నాయి. ఇంత వరకు అంతు చిక్కని ప్రశ్నలు రాష్ట్ర ప్రజల్లో మరిన్ని అనుమానాలను లెవనెత్తున్నాయి.

viveka_murder_case
viveka_murder_case

Prathidwani : హూ కిల్డ్‌ బాబాయ్‌ ? బాబాయిని ఎవరు చంపారు ? ఐదేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న ఇది. సీఎం Y.S.జగన్‌మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపిన హంతకులెవరో అంతుచిక్కని రహస్యంలా మిగిలిపోయింది. ఇంటి దొంగల పనేనని వివేకా కుమార్తె సునీతారెడ్డి బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. అదే నిజమని దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ నిగ్గుతేల్చింది. కడప ఎంపీ వైఎస్ అ​వినాష్‌రెడ్డి సూత్రధారి అంటూ అరెస్ట్ చేయడానికి సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కానీ ఇంతవరకు అరెస్ట్ జరగలేదు. ఇలాగైతే చట్టం, న్యాయంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందా? వివేకా హంతకులను ఎవరు కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో విశ్లేషకులు గోశాల ప్రసాద్​, సీనియర్​ జర్నలిస్ట్​ శ్రీనివాసరావు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమన్నారో విన్నారు కదా. గొడ్డలిపోటును గుండెపోటుగా ఎందుకు మార్చారు ? నారాసుర రక్తచరిత్ర అంటూ కట్టుకథలు ఎందుకు అల్లారు ? వివేకా హత్య ఎలా జరిగిందో సీన్‌ టూ సీన్ కళ్లకు కట్టేలా, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ ఎలా వివరించారో చూడండి అనే ప్రశ్నకు గోశాల ప్రసాద్​ వివరించారు. జగన్‌ డిమాండ్‌ను చూశాం కదా. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను సీఎం కాగానే ఎందుకు ఉపసంహరించుకున్నారు? జగన్ చెప్పినట్లు ఒక కన్ను ఇంకో కంటిని పొడుచుకోలేదన్నది నిజమైతే వివేకా కుమార్తె సునీతారెడ్డి పోరాటంతో రంగంలోకి దిగిన సీబీఐని ఎందుకు ముప్పుతిప్పలు పెట్టారు? ఐదేళ్లలో సొంత బాబాయి హంతకుల్నే పట్టుకోలేని జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భద్రతకు ఎలాంటి భరోసా ఇవ్వగలిగింది? వంటి ప్రశ్నలకు గోశాల ప్రసాద్​ సమాధానం ఇచ్చారు.

రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?

జగన్‌ మాటలు విన్నారు కదా. వివేకా హత్యపై పోలీసులు ప్రకటన కూడా చేయకముందే ఎలా చంపారో జగన్‌ అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు? వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలన్న జగన్ డిమాండ్‌ను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులే చంపారని వివేకా కుమార్తె సునీతారెడ్డి చెబుతున్నారు. అప్రూవర్‌ దస్తగిరి కూడా ఆ మాటే చెప్పాడు. సీబీఐదీ అదే మాట. అయినా కేసు ముందుకు కదలకుండా అడ్డుకుంటున్న శక్తులేంటి? వివేకా హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి 10 కోట్లు ఆఫర్‌ చేశారని తర్వాత మాట మార్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి అనుమాస్పదంగా మృతి చెందారు. తన ప్రాణాలకు ముప్పుందని అప్రూవర్‌ దస్తగిరి ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుతో లింక్ ఉన్న ఇద్దరి చావులు, మరొకరి ఆందోళనకు కారణమెవరు? వివేకా హంతకుల్ని కాపాడుతున్న జగనన్నకు ఓటేయవద్దని ఆయన చెల్లెలు సునీత బహిరంగంగా ప్రజల్ని కోరారు. ఇప్పుడు కూడా జగన్‌కు ఓటేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి ? వంటి ప్రశ్నలకు శ్రీనివాసరావు సమాధానం చెప్పారు.

జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?

Prathidwani : హూ కిల్డ్‌ బాబాయ్‌ ? బాబాయిని ఎవరు చంపారు ? ఐదేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న ఇది. సీఎం Y.S.జగన్‌మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపిన హంతకులెవరో అంతుచిక్కని రహస్యంలా మిగిలిపోయింది. ఇంటి దొంగల పనేనని వివేకా కుమార్తె సునీతారెడ్డి బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. అదే నిజమని దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ నిగ్గుతేల్చింది. కడప ఎంపీ వైఎస్ అ​వినాష్‌రెడ్డి సూత్రధారి అంటూ అరెస్ట్ చేయడానికి సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కానీ ఇంతవరకు అరెస్ట్ జరగలేదు. ఇలాగైతే చట్టం, న్యాయంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందా? వివేకా హంతకులను ఎవరు కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో విశ్లేషకులు గోశాల ప్రసాద్​, సీనియర్​ జర్నలిస్ట్​ శ్రీనివాసరావు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమన్నారో విన్నారు కదా. గొడ్డలిపోటును గుండెపోటుగా ఎందుకు మార్చారు ? నారాసుర రక్తచరిత్ర అంటూ కట్టుకథలు ఎందుకు అల్లారు ? వివేకా హత్య ఎలా జరిగిందో సీన్‌ టూ సీన్ కళ్లకు కట్టేలా, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ ఎలా వివరించారో చూడండి అనే ప్రశ్నకు గోశాల ప్రసాద్​ వివరించారు. జగన్‌ డిమాండ్‌ను చూశాం కదా. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను సీఎం కాగానే ఎందుకు ఉపసంహరించుకున్నారు? జగన్ చెప్పినట్లు ఒక కన్ను ఇంకో కంటిని పొడుచుకోలేదన్నది నిజమైతే వివేకా కుమార్తె సునీతారెడ్డి పోరాటంతో రంగంలోకి దిగిన సీబీఐని ఎందుకు ముప్పుతిప్పలు పెట్టారు? ఐదేళ్లలో సొంత బాబాయి హంతకుల్నే పట్టుకోలేని జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భద్రతకు ఎలాంటి భరోసా ఇవ్వగలిగింది? వంటి ప్రశ్నలకు గోశాల ప్రసాద్​ సమాధానం ఇచ్చారు.

రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?

జగన్‌ మాటలు విన్నారు కదా. వివేకా హత్యపై పోలీసులు ప్రకటన కూడా చేయకముందే ఎలా చంపారో జగన్‌ అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు? వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలన్న జగన్ డిమాండ్‌ను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులే చంపారని వివేకా కుమార్తె సునీతారెడ్డి చెబుతున్నారు. అప్రూవర్‌ దస్తగిరి కూడా ఆ మాటే చెప్పాడు. సీబీఐదీ అదే మాట. అయినా కేసు ముందుకు కదలకుండా అడ్డుకుంటున్న శక్తులేంటి? వివేకా హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి 10 కోట్లు ఆఫర్‌ చేశారని తర్వాత మాట మార్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి అనుమాస్పదంగా మృతి చెందారు. తన ప్రాణాలకు ముప్పుందని అప్రూవర్‌ దస్తగిరి ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుతో లింక్ ఉన్న ఇద్దరి చావులు, మరొకరి ఆందోళనకు కారణమెవరు? వివేకా హంతకుల్ని కాపాడుతున్న జగనన్నకు ఓటేయవద్దని ఆయన చెల్లెలు సునీత బహిరంగంగా ప్రజల్ని కోరారు. ఇప్పుడు కూడా జగన్‌కు ఓటేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి ? వంటి ప్రశ్నలకు శ్రీనివాసరావు సమాధానం చెప్పారు.

జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.