ETV Bharat / state

బాధ్యత చూసేవాడే బరువయ్యాడు - ఆపన్నహస్తం కోసం ఆ పేద కుటుంబం ఎదరుచూపులు - Seeking Help For Son Treatment

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 8:17 AM IST

A Poor Family Waiting For Helping Hands : అసలే పేదరికం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఏ జీవనాధారం లేదు. వృద్ధాప్యంలో తోడుగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన కుమారుడు కండర క్షీణత వ్యాధితో మంచానికే పరిమితంకావడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కుమారుడి వ్యాధి నయంకాలేదు. తన బిడ్డా దీనస్థితి చూడలేక ఆ తల్లి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

Poor Family Seeking Help For Son Treatment
A Poor Family Waiting For Helping Hands (ETV Bharat)

బాధ్యత చూసేవాడే బరువయ్యాడు - ఆపన్నహస్తం కోసం ఆ పేద కుటుంబం ఎదరుచూపులు (ETV Bharat)

Poor Family Seeking Help For Son Treatment : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన రమావత్‌ తులసి-సీతారం కుమారుడు శ్రీను. ఏడో తరగతి వరకి బాగానే పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత చిన్నగా కాళ్లు పట్టు కోల్పోయాయి. ఆస్పత్రులకు తీసుకెళ్లగా కండర క్షీణత వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. క్రమంగా కాళ్లు, చేతులు చచ్చిబడిపోయాయి. ప్రస్తుతం శ్రీను వయస్సు 23 ఏళ్లు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు.

ఒకరు పనికి వెళితే మరోకరు ఇంటి వద్ద ఉండి శ్రీనును చూసుకోవాల్సిన పరిస్థితి. వయసు మీద పడటంతో వారు పనిచేయలేకపోతుండటంతో కుటుంబపోషణ భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్, రేషన్‌ బియ్యంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన సమయంలో వారికి భారంగా మారానని శ్రీను మనోవేదనకు గురవుతున్నాడు. తనకు వచ్చిన కండరాల క్షీణిత వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు. కన్నవారికి భారం అవుతున్నానని తానూ చనిపోతా అని ఏమైనా విషం ఉంటే ఇవ్వూ అని తల్లిదండ్రులని వేడుకుంటున్నాడు.

'చిన్నప్పుడు బాగానే ఉన్నా. నేను మంచిస్థాయిలో ఉండాలని నా తల్లిదండ్రులు అనుకునే సమయంలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. నడవ రాదు కూర్చో రాదు. నేను ఏం చేయాలన్నా మా అమ్మానాన్నలే చూసుకుంటున్నారు. వారికి కూడా వయసు మీద పడటంతో మా పరిస్థితి ఘోరంగా మారింది. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం'- రమావత్‌ శ్రీను, కండర క్షీణత బాధితుడు

బలవర్థకమైన ఔషధాలకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నా శ్రీను, ప్రభుత్వం దయ చూపాలని కోరుతున్నాడు. కుటుంబ పోషణ కోసం పోరాడుతూనే కుమారుడిని బతికించుకోవడం కోసం వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడి వైద్యం కోసం జీవనాధారమైన ఎకరం భూమిని అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు.

కుమారునికి పోషకాహారం అందించే ఆర్థిక స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. కండరాల క్షీణత వ్యాధి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిందని, పూట గడవడమే కష్టంగా మారిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సాయం చేసి అదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

'మాకు ఎలాంటి సంపద లేదు. రోజువారీ కూలీ డబ్బులతోనే జీవిస్తున్నాం. నా కుమారిడికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడంతో ప్రతిదీ మేం చూసుకోవాలి. కానీ ఇప్పుడు మేం కూడా వృద్ధాప్యానికి వచ్చాం. ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని వేడుకుంటున్నా'- రమావత్‌ తులసి, బాధితుడి తల్లి

ఆ కుటుంబానికి ఎంత కష్టమొచ్చింది - ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూపు - A Poor Family Waiting For Helping Hands

బాధ్యత చూసేవాడే బరువయ్యాడు - ఆపన్నహస్తం కోసం ఆ పేద కుటుంబం ఎదరుచూపులు (ETV Bharat)

Poor Family Seeking Help For Son Treatment : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన రమావత్‌ తులసి-సీతారం కుమారుడు శ్రీను. ఏడో తరగతి వరకి బాగానే పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత చిన్నగా కాళ్లు పట్టు కోల్పోయాయి. ఆస్పత్రులకు తీసుకెళ్లగా కండర క్షీణత వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. క్రమంగా కాళ్లు, చేతులు చచ్చిబడిపోయాయి. ప్రస్తుతం శ్రీను వయస్సు 23 ఏళ్లు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు.

ఒకరు పనికి వెళితే మరోకరు ఇంటి వద్ద ఉండి శ్రీనును చూసుకోవాల్సిన పరిస్థితి. వయసు మీద పడటంతో వారు పనిచేయలేకపోతుండటంతో కుటుంబపోషణ భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్, రేషన్‌ బియ్యంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన సమయంలో వారికి భారంగా మారానని శ్రీను మనోవేదనకు గురవుతున్నాడు. తనకు వచ్చిన కండరాల క్షీణిత వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు. కన్నవారికి భారం అవుతున్నానని తానూ చనిపోతా అని ఏమైనా విషం ఉంటే ఇవ్వూ అని తల్లిదండ్రులని వేడుకుంటున్నాడు.

'చిన్నప్పుడు బాగానే ఉన్నా. నేను మంచిస్థాయిలో ఉండాలని నా తల్లిదండ్రులు అనుకునే సమయంలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. నడవ రాదు కూర్చో రాదు. నేను ఏం చేయాలన్నా మా అమ్మానాన్నలే చూసుకుంటున్నారు. వారికి కూడా వయసు మీద పడటంతో మా పరిస్థితి ఘోరంగా మారింది. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం'- రమావత్‌ శ్రీను, కండర క్షీణత బాధితుడు

బలవర్థకమైన ఔషధాలకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నా శ్రీను, ప్రభుత్వం దయ చూపాలని కోరుతున్నాడు. కుటుంబ పోషణ కోసం పోరాడుతూనే కుమారుడిని బతికించుకోవడం కోసం వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడి వైద్యం కోసం జీవనాధారమైన ఎకరం భూమిని అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు.

కుమారునికి పోషకాహారం అందించే ఆర్థిక స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. కండరాల క్షీణత వ్యాధి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిందని, పూట గడవడమే కష్టంగా మారిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సాయం చేసి అదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

'మాకు ఎలాంటి సంపద లేదు. రోజువారీ కూలీ డబ్బులతోనే జీవిస్తున్నాం. నా కుమారిడికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడంతో ప్రతిదీ మేం చూసుకోవాలి. కానీ ఇప్పుడు మేం కూడా వృద్ధాప్యానికి వచ్చాం. ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని వేడుకుంటున్నా'- రమావత్‌ తులసి, బాధితుడి తల్లి

ఆ కుటుంబానికి ఎంత కష్టమొచ్చింది - ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూపు - A Poor Family Waiting For Helping Hands

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.