ETV Bharat / state

మైనర్​ బాలికపై అత్యాచారం చేసిన సీఐ - అదుపులోకి తీసుకున్న పోలీసులు - POCSO Case Filed On CI - POCSO CASE FILED ON CI

POCSO Case Filed On CI : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారిపై ఫోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలికపై సీఐ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

POCSO Case Filed On CI
POCSO Case Filed On CI
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 5:13 PM IST

POCSO Case Filed On CI : మైనర్​ బాలికపై ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె తల్లి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గతంలో కేయూ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన బండారి సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. 2022 లో కేయూలో ఎస్ఐగా విధులు నిర్విహించారు. ఈ క్రమంలోనే తన భార్యతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారని పోలీస్ అధికారిపై మహిళ భర్త పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు చేయగా ఆయనను ఏఆర్​కు అటాచ్ చేశారు.

WOMAN FILES COMPLAINT ON CI : కొంతకాలం తర్వాత సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లినప్పటికీ ఆ మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మహిళ కుమార్తెపై ఆ అధికారి కన్నుపడింది. మైనర్​ అయిన తన కుమార్తెపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడినట్లుగా కేయూ పోలీస్​ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన కేయూ పోలీసులు సదరు అధికారిపై అత్యాచార యత్నం, ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హజరుపరుస్తామని తెలిపారు.

"భూపాలపల్లిలో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్​పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టి సదరు అధికారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మెడికల్ రిపోర్టులు వచ్చాక కేసులో పురోగతి ఉంటుంది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లయితే చట్టం పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం" - సంజీవ్, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ

చట్టాన్ని కాపాడాల్సిన సర్కిల్ ఇన్​స్పెక్టర్​పైనే అత్యాచారం కేసు, అందులోనూ ఫోక్సో కేసు నమోదు కావడం వరంగల్ నగరంలో చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతైన అధికారిగా ఉండి ఇలా నీచమైన పనులకు పాల్పడిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విషయంలో వేగంగా దర్యాప్తు జరిపాలని వారు కోరారు.

లేడీసే కదా అని లిఫ్ట్​ ఇస్తున్నారా - ఇలాంటోళ్లు కూడా ఉంటారు, జర పైలం

17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​ - పరారీలో ముగ్గురు నిందితులు

యూపీలో హైదరాబాద్​ యువతిపై గ్యాంగ్​రేప్.. ఉద్యోగం కోసం వెళ్తే దారుణం

POCSO Case Filed On CI : మైనర్​ బాలికపై ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె తల్లి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గతంలో కేయూ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన బండారి సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. 2022 లో కేయూలో ఎస్ఐగా విధులు నిర్విహించారు. ఈ క్రమంలోనే తన భార్యతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారని పోలీస్ అధికారిపై మహిళ భర్త పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు చేయగా ఆయనను ఏఆర్​కు అటాచ్ చేశారు.

WOMAN FILES COMPLAINT ON CI : కొంతకాలం తర్వాత సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లినప్పటికీ ఆ మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మహిళ కుమార్తెపై ఆ అధికారి కన్నుపడింది. మైనర్​ అయిన తన కుమార్తెపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడినట్లుగా కేయూ పోలీస్​ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన కేయూ పోలీసులు సదరు అధికారిపై అత్యాచార యత్నం, ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హజరుపరుస్తామని తెలిపారు.

"భూపాలపల్లిలో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్​పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టి సదరు అధికారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మెడికల్ రిపోర్టులు వచ్చాక కేసులో పురోగతి ఉంటుంది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లయితే చట్టం పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం" - సంజీవ్, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ

చట్టాన్ని కాపాడాల్సిన సర్కిల్ ఇన్​స్పెక్టర్​పైనే అత్యాచారం కేసు, అందులోనూ ఫోక్సో కేసు నమోదు కావడం వరంగల్ నగరంలో చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతైన అధికారిగా ఉండి ఇలా నీచమైన పనులకు పాల్పడిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విషయంలో వేగంగా దర్యాప్తు జరిపాలని వారు కోరారు.

లేడీసే కదా అని లిఫ్ట్​ ఇస్తున్నారా - ఇలాంటోళ్లు కూడా ఉంటారు, జర పైలం

17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​ - పరారీలో ముగ్గురు నిందితులు

యూపీలో హైదరాబాద్​ యువతిపై గ్యాంగ్​రేప్.. ఉద్యోగం కోసం వెళ్తే దారుణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.