ETV Bharat / state

తల్లితో 'లివ్ ఇన్' - కూతురితో 'లవ్ గేమ్' - ఈయన మామూలోడు కాదు సామీ

ఓవైపు తల్లితో సహజీవనం మరోవైపు కూతురితో ప్రేమాయణం - ఆపై కుమార్తెతో ఇంటి నుంచి పరార్ - తల్లి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు - నిందితుడిపై పోక్సో కేసు నమోదు

Pocso Case Filed On Man
Pocso Case Filed On Man (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Man Having Affair With Daughter in AP : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెతో ప్రేమాయణం నడిపాడు ఓ ప్రబుద్ధుడు. అంతే కాదు తల్లికి చెప్పకుండా స్కూల్ నుంచి ఆ మైనర్ బాలికను తనతో తీసుకెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ ఆందోళన చెందింది. రాత్రి వరకు చుట్టుపక్కల వెతికి చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా ఆ ఇద్దరూ హైదరాబాద్​లో దొరికారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. కుమార్తెతో కలిసి ఆమె వేరుగా జీవిస్తోంది. అలా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆ తల్లీకూతుళ్ల జీవితంలో టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు.

మాయమాటలు చెప్పి ప్రేమాయణం : ఇండ్లా రాజు అనే వ్యక్తితో ఈ తల్లీకూతుళ్లకు పరిచయం ఏర్పడింది. అలా ఆ మహిళతో రాజు సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడు ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. రోజు ఆమెను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు వస్తుండేవాడు. అలా తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న రాజు తన నైతికతను మరిచాడు. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెబుతూ ప్రేమలో దింపాడు.

బాలికతో ఇంటి నుంచి పరార్​ : అతడిని నమ్మిన ఆ బాలిక ఏం చెప్పినా వినడం మొదలుపెట్టింది. ఇక ఆమెను పూర్తిగా లోబర్చుకున్న రాజు ఆమె తల్లి వద్ద నుంచి బాలికను తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. అలా రెండ్రోజుల క్రితం రోజూలాగే బాలికను స్కూల్​లో దింపొస్తానని ఆమె తల్లికి చెప్పి తీసుకెళ్లాడు. అయితే సాయంత్రమైనా తిరిగి రాలేదు. రాత్రి వరకు వేచి చూసి అయినా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసింది ఆ తల్లి. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.

పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు : బాలిక తల్లి ఫిర్యాదు నమోదు చేసుకున్న ఒంగోలు రెండో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బాలికతో పాటు నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి నగరానికి వచ్చారు. వారిద్దరిని ఒంగోలు తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమె తల్లితో ఇంటికి పంపించారు. ఇక రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

కాపాడాల్సిన వాడే కాటేయబోయాడు - మైనర్​ బాలికపై సీఐ అత్యాచారయత్నం

సిద్దిపేట జిల్లాలో బాలికపై అత్యాచారం - నిందితుడి ఇంటికి నిప్పంటించిన గ్రామస్థులు - Girl Raped in Siddepet

Man Having Affair With Daughter in AP : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెతో ప్రేమాయణం నడిపాడు ఓ ప్రబుద్ధుడు. అంతే కాదు తల్లికి చెప్పకుండా స్కూల్ నుంచి ఆ మైనర్ బాలికను తనతో తీసుకెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ ఆందోళన చెందింది. రాత్రి వరకు చుట్టుపక్కల వెతికి చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా ఆ ఇద్దరూ హైదరాబాద్​లో దొరికారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. కుమార్తెతో కలిసి ఆమె వేరుగా జీవిస్తోంది. అలా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆ తల్లీకూతుళ్ల జీవితంలో టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు.

మాయమాటలు చెప్పి ప్రేమాయణం : ఇండ్లా రాజు అనే వ్యక్తితో ఈ తల్లీకూతుళ్లకు పరిచయం ఏర్పడింది. అలా ఆ మహిళతో రాజు సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడు ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. రోజు ఆమెను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు వస్తుండేవాడు. అలా తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న రాజు తన నైతికతను మరిచాడు. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెబుతూ ప్రేమలో దింపాడు.

బాలికతో ఇంటి నుంచి పరార్​ : అతడిని నమ్మిన ఆ బాలిక ఏం చెప్పినా వినడం మొదలుపెట్టింది. ఇక ఆమెను పూర్తిగా లోబర్చుకున్న రాజు ఆమె తల్లి వద్ద నుంచి బాలికను తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. అలా రెండ్రోజుల క్రితం రోజూలాగే బాలికను స్కూల్​లో దింపొస్తానని ఆమె తల్లికి చెప్పి తీసుకెళ్లాడు. అయితే సాయంత్రమైనా తిరిగి రాలేదు. రాత్రి వరకు వేచి చూసి అయినా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసింది ఆ తల్లి. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.

పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు : బాలిక తల్లి ఫిర్యాదు నమోదు చేసుకున్న ఒంగోలు రెండో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బాలికతో పాటు నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి నగరానికి వచ్చారు. వారిద్దరిని ఒంగోలు తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమె తల్లితో ఇంటికి పంపించారు. ఇక రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

కాపాడాల్సిన వాడే కాటేయబోయాడు - మైనర్​ బాలికపై సీఐ అత్యాచారయత్నం

సిద్దిపేట జిల్లాలో బాలికపై అత్యాచారం - నిందితుడి ఇంటికి నిప్పంటించిన గ్రామస్థులు - Girl Raped in Siddepet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.