ETV Bharat / state

కూలిపోయిన వంతెనతో తప్పని తిప్పలు - తీవ్ర అవస్థలు పడుతున్న స్థానికులు - Problems Due to Bridge Collapse

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 8:26 AM IST

Updated : Sep 14, 2024, 8:55 AM IST

Bridge Collapse in Suryapet District : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టమే మిగిలింది. వరద ప్రభావం సూర్యాపేట జిల్లాలో తక్కువగా ఉన్నప్పటికి వందల కిలో మీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పది రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు, గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

People Facing Problems Due to Bridge Collapse
Bridge Collapse in Suryapet District (ETV Bharat)

People Facing Problems Due to Bridge Collapse : భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సుమారు 381 పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 100 కిలోమీటర్ల మేర పాక్షికంగా మరమ్మతులకు గురి కాగా 23 కల్వర్టులు కూలిపోయాయి. కోదాడ, హుజూర్‌నగర్ పరిసర ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు తాడు సాయంతో బిక్కుబిక్కుమంటూ ప్రమాదకర స్థితిలో వంతెన దాటుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు-కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో కోదాడ- మేళ్లచెరువు మధ్య రాకపోకలు స్తంభించాయి. వంతెన కూలిపోవడంతో గత పది రోజులు నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

'కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోయింది. సుమారు 40 సంవత్సరాలు అవుతుంది ఈ వంతెనను నిర్మించి. వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా అవస్థలు పడుతున్నాం. విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుంది. త్వరగా వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలి'- స్థానికులు

16 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం : వంతెనలు కూలడంతో మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి. మేళ్లచెరువు రావడానికి వేరే మార్గం గుండా వెళ్తే 16 కిలోమీటర్లు దూరం అదనంగా రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాత్కలిక వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న వందల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

'మేళ్లచెరువు - కోదాడకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు నాలుగైదు మండలాల స్థానికులు ఈ రహదారిలో నడుస్తారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో చుట్టు తిరిగి పోవాల్సి వస్తోంది. పక్కన మరో రోడ్డు వేయాలి. తొందరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలి'-స్థానికులు

భారీ వర్షాలకు కూలిన వంతెన- ప్రయాణికులకు తప్పని తిప్పలు - BRIDGE COLLAPSED IN KANDIBANDA

ప్రమాదమని తెలిసినా - తప్పని ప్రయాణం - రైలు పట్టాలనే రహదారిగా చేసుకున్న గ్రామస్థులు - People Travelling on Railway Bridge

People Facing Problems Due to Bridge Collapse : భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సుమారు 381 పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 100 కిలోమీటర్ల మేర పాక్షికంగా మరమ్మతులకు గురి కాగా 23 కల్వర్టులు కూలిపోయాయి. కోదాడ, హుజూర్‌నగర్ పరిసర ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు తాడు సాయంతో బిక్కుబిక్కుమంటూ ప్రమాదకర స్థితిలో వంతెన దాటుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు-కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో కోదాడ- మేళ్లచెరువు మధ్య రాకపోకలు స్తంభించాయి. వంతెన కూలిపోవడంతో గత పది రోజులు నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

'కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోయింది. సుమారు 40 సంవత్సరాలు అవుతుంది ఈ వంతెనను నిర్మించి. వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా అవస్థలు పడుతున్నాం. విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుంది. త్వరగా వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలి'- స్థానికులు

16 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం : వంతెనలు కూలడంతో మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి. మేళ్లచెరువు రావడానికి వేరే మార్గం గుండా వెళ్తే 16 కిలోమీటర్లు దూరం అదనంగా రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాత్కలిక వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న వందల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

'మేళ్లచెరువు - కోదాడకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు నాలుగైదు మండలాల స్థానికులు ఈ రహదారిలో నడుస్తారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో చుట్టు తిరిగి పోవాల్సి వస్తోంది. పక్కన మరో రోడ్డు వేయాలి. తొందరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలి'-స్థానికులు

భారీ వర్షాలకు కూలిన వంతెన- ప్రయాణికులకు తప్పని తిప్పలు - BRIDGE COLLAPSED IN KANDIBANDA

ప్రమాదమని తెలిసినా - తప్పని ప్రయాణం - రైలు పట్టాలనే రహదారిగా చేసుకున్న గ్రామస్థులు - People Travelling on Railway Bridge

Last Updated : Sep 14, 2024, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.