ETV Bharat / state

నిలిచిన ఉల్లి విక్రయాలు- మార్కెట్ ఎదుట అన్నదాతల జాగారం

వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించారని ఉల్లి రైతుల ఆవేదన

onion_sales_stalled_in_kurnool_market_farmers_facing_problems
onion_sales_stalled_in_kurnool_market_farmers_facing_problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 1 hours ago

Onion Sales Stalled in Kurnool Market Farmers Facing Problems : ఉల్లి రైతులకు కంటి మీద కునుకే కరవైంది. పంట అమ్మకానికి తీసుకొచ్చిన వారు జాగారం చేయాల్సి వస్తోంది. అధికారులకు ముందస్తు వ్యూహం లేకపోవడం వల్ల ఇప్పుడు కర్షకులు రోడ్డుపై పడ్డారు. మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కర్నూలు వ్యవసాయ మార్కెట్​కు ఉల్లి పోటెత్తుతోంది. గత నెల రోజులుగా ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పంటతో మార్కెట్​కు వరుస కట్టారు. నిత్యం రికార్డు స్థాయిలో 20 నుంచి 22 వేల క్వింటాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసి సరకును సకాలంలో బయటకు తరలించలేకపోయారు. ప్రస్తుతం ఆరు వేల టన్నుల వరకు ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ఉల్లి గుట్టలు ఖాళీ చేసిన తర్వాతనే సరకును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు రైతులంతా రోడ్లపై నిరీక్షించాల్సిందే.

3 రోజులు- 65,500 క్వింటాళ్లు : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 17,763 హెక్టార్లలో ఉల్లి పంట సాగైంది. ఉల్లి కొనుగోళ్లకు కర్నూలు మార్కెట్‌ ప్రసిద్ధి. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రైతులు సరకు తీసుకొస్తుంటారు. ఈ సీజన్‌లో ఆగస్టు నుంచి విక్రయాలు ప్రారంభయ్యాయి. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులంతా మార్కెట్‌కు వరుస కట్టారు. గత మూడు రోజుల వ్యవధిలో 67,500 క్వింటాళ్లు వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సర్వర్‌-ఎర్రర్‌ : ఈ.నామ్‌ విధానం అమలవుతున్న విపణుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాలుగైదు రోజులైనా పరిష్కరించకపోవడంతో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తై ధర ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
గతంలో ఇంతకంటే అధిక మొత్తంలో అన్నిరకాల పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలోనూ ఏనాడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఆపేసిన దాఖలాలు లేవు. మార్కెట్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, వ్యాపారులు రైతులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు.

నిశీధిలో తూకాలు : ఈ.నామ్‌ విధానం పనిచేయకపోవడంతో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తై ధరలు ప్రకటించేందుకు సాయంత్రం 5 నుంచి 6 గంటలవుతోంది. రాత్రి 7 గంటలకు తూకాలు మొదలు పెడుతున్నారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు తూకాలు పూర్తి కాలేదు. బుధవారం సాయంత్రం మార్కెట్‌కు సరకును తీసుకొచ్చిన రైతు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రేయింబవళ్లు విపణిలోనే నిరీక్షిస్తున్నారు.

అధికారుల ఘోర వైఫల్యం : నిత్యం మధ్యాహ్నం 2 గంటలలోపు ధరలు ప్రకటించి ఉల్లి క్రయ విక్రయాలు జరిగేలా చూస్తే విపణిని పూర్తిస్థాయిలో బంద్‌ చేసే పరిస్థితి ఉండదు.. సాయంత్రం 5-రాత్రి 7 గంటల లోపు తూకాలు పూర్తవుతాయి.
గత మూడు రోజులుగా రాత్రి వేళల్లో తూకాలు వేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. తూకాలు ఎవరు వేస్తున్నారు.. మోసాలేమైనా జరుగుతున్నాయా అన్న విషయాన్ని పట్టించుకోలేదు.

భయపెడుతున్న ఉల్లి ధరలు - కొనడానికి జంకుతున్న సామాన్యులు - Increase Onion Prices in AP

'ఐదెకరాల్లో రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేశా. వర్షాభావ పరిస్థితులు, అధిక వర్షాలతో దిగుబడులు తగ్గాయి. ఇటీవల క్వింటా రూ.1,800 చొప్పున 55 క్వింటాళ్ల ఉల్లి విక్రయించా. ప్రస్తుతం 95 ప్యాకెట్ల ఉల్లి అమ్ముకునేందుకు విపణికి తీసుకొచ్చా. ఎకరాకు 200 ప్యాకెట్ల ఉల్లి దిగుబడులు రావాలి. అలాంటిది సగానికి సగం పడిపోయింది. వచ్చిన అరకొర పంటను అమ్ముకుందామంటే వ్యాపారులు సిండికేటై ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.' -ప్రతాపరెడ్డి, ఉల్చాల

అన్నదాతకు ఆకలిమంట : అందరికీ అన్నంపెట్టే అన్నదాత పంట అమ్ముకోవడానికి పస్తులుండాల్సి వస్తోంది. కర్నూలు మార్కెట్‌కు పంట తీసుకొచ్చే రైతులకు మధ్యాహ్న భోజనం రాయితీపై అందిస్తారు. నిత్యం ఎంత మంది రైతులు మార్కెట్‌కు సరకు తీసుకొస్తున్నారో వారందరికీ భోజనం అందించాల్సి ఉంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 22,500 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు విపణికి వచ్చాయి. మరోవైపు ఎంతమంది రైతులు సరకు తీసుకొస్తున్నారన విషయాన్ని మార్కెట్‌ కమిటీ అధికారులు ఇస్కాన్‌ వారికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారు రోజువారీ అంచనా ప్రకారం 400 మందికి భోజన పెట్టారు. మిగిలిన వారందరూ బయట తినాల్సిన పరిస్థితి. చాలామంది సరకు వదిలి వెళ్లలేక ఆకలితో అల్లాడిపోయారు.

'బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.50-60 పలుకుతోంది. ఇక్కడి వ్యాపారులు ఒక్కటై రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. నాలుగైదు లాట్లను రూ.4 వేలు పెడుతున్నారు. మిగిలిన సరకును రూ.1,500-2 వేల లోపు ధరకు తీసుకుంటున్నారు. 1.60 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తే 120 ప్యాకెట్ల దిగుబడి వచ్చిందని రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టా.. విపణిలో ధర చూస్తే క్వింటా రూ.2 వేలకు మించి ధర రావడం లేదు.' -రాంభూపాల్, కౌలురైతు, పంచలింగాల

తగ్గిన ఉల్లి దిగుబడి - ధరలు పైపైకి - అయినా రైతన్నకు తప్పని నష్టాలు - Onion Crop Damage in Kurnool

Onion Sales Stalled in Kurnool Market Farmers Facing Problems : ఉల్లి రైతులకు కంటి మీద కునుకే కరవైంది. పంట అమ్మకానికి తీసుకొచ్చిన వారు జాగారం చేయాల్సి వస్తోంది. అధికారులకు ముందస్తు వ్యూహం లేకపోవడం వల్ల ఇప్పుడు కర్షకులు రోడ్డుపై పడ్డారు. మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కర్నూలు వ్యవసాయ మార్కెట్​కు ఉల్లి పోటెత్తుతోంది. గత నెల రోజులుగా ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పంటతో మార్కెట్​కు వరుస కట్టారు. నిత్యం రికార్డు స్థాయిలో 20 నుంచి 22 వేల క్వింటాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసి సరకును సకాలంలో బయటకు తరలించలేకపోయారు. ప్రస్తుతం ఆరు వేల టన్నుల వరకు ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ఉల్లి గుట్టలు ఖాళీ చేసిన తర్వాతనే సరకును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు రైతులంతా రోడ్లపై నిరీక్షించాల్సిందే.

3 రోజులు- 65,500 క్వింటాళ్లు : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 17,763 హెక్టార్లలో ఉల్లి పంట సాగైంది. ఉల్లి కొనుగోళ్లకు కర్నూలు మార్కెట్‌ ప్రసిద్ధి. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రైతులు సరకు తీసుకొస్తుంటారు. ఈ సీజన్‌లో ఆగస్టు నుంచి విక్రయాలు ప్రారంభయ్యాయి. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులంతా మార్కెట్‌కు వరుస కట్టారు. గత మూడు రోజుల వ్యవధిలో 67,500 క్వింటాళ్లు వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సర్వర్‌-ఎర్రర్‌ : ఈ.నామ్‌ విధానం అమలవుతున్న విపణుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాలుగైదు రోజులైనా పరిష్కరించకపోవడంతో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తై ధర ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
గతంలో ఇంతకంటే అధిక మొత్తంలో అన్నిరకాల పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలోనూ ఏనాడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఆపేసిన దాఖలాలు లేవు. మార్కెట్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, వ్యాపారులు రైతులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు.

నిశీధిలో తూకాలు : ఈ.నామ్‌ విధానం పనిచేయకపోవడంతో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తై ధరలు ప్రకటించేందుకు సాయంత్రం 5 నుంచి 6 గంటలవుతోంది. రాత్రి 7 గంటలకు తూకాలు మొదలు పెడుతున్నారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు తూకాలు పూర్తి కాలేదు. బుధవారం సాయంత్రం మార్కెట్‌కు సరకును తీసుకొచ్చిన రైతు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రేయింబవళ్లు విపణిలోనే నిరీక్షిస్తున్నారు.

అధికారుల ఘోర వైఫల్యం : నిత్యం మధ్యాహ్నం 2 గంటలలోపు ధరలు ప్రకటించి ఉల్లి క్రయ విక్రయాలు జరిగేలా చూస్తే విపణిని పూర్తిస్థాయిలో బంద్‌ చేసే పరిస్థితి ఉండదు.. సాయంత్రం 5-రాత్రి 7 గంటల లోపు తూకాలు పూర్తవుతాయి.
గత మూడు రోజులుగా రాత్రి వేళల్లో తూకాలు వేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. తూకాలు ఎవరు వేస్తున్నారు.. మోసాలేమైనా జరుగుతున్నాయా అన్న విషయాన్ని పట్టించుకోలేదు.

భయపెడుతున్న ఉల్లి ధరలు - కొనడానికి జంకుతున్న సామాన్యులు - Increase Onion Prices in AP

'ఐదెకరాల్లో రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేశా. వర్షాభావ పరిస్థితులు, అధిక వర్షాలతో దిగుబడులు తగ్గాయి. ఇటీవల క్వింటా రూ.1,800 చొప్పున 55 క్వింటాళ్ల ఉల్లి విక్రయించా. ప్రస్తుతం 95 ప్యాకెట్ల ఉల్లి అమ్ముకునేందుకు విపణికి తీసుకొచ్చా. ఎకరాకు 200 ప్యాకెట్ల ఉల్లి దిగుబడులు రావాలి. అలాంటిది సగానికి సగం పడిపోయింది. వచ్చిన అరకొర పంటను అమ్ముకుందామంటే వ్యాపారులు సిండికేటై ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.' -ప్రతాపరెడ్డి, ఉల్చాల

అన్నదాతకు ఆకలిమంట : అందరికీ అన్నంపెట్టే అన్నదాత పంట అమ్ముకోవడానికి పస్తులుండాల్సి వస్తోంది. కర్నూలు మార్కెట్‌కు పంట తీసుకొచ్చే రైతులకు మధ్యాహ్న భోజనం రాయితీపై అందిస్తారు. నిత్యం ఎంత మంది రైతులు మార్కెట్‌కు సరకు తీసుకొస్తున్నారో వారందరికీ భోజనం అందించాల్సి ఉంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 22,500 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు విపణికి వచ్చాయి. మరోవైపు ఎంతమంది రైతులు సరకు తీసుకొస్తున్నారన విషయాన్ని మార్కెట్‌ కమిటీ అధికారులు ఇస్కాన్‌ వారికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారు రోజువారీ అంచనా ప్రకారం 400 మందికి భోజన పెట్టారు. మిగిలిన వారందరూ బయట తినాల్సిన పరిస్థితి. చాలామంది సరకు వదిలి వెళ్లలేక ఆకలితో అల్లాడిపోయారు.

'బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.50-60 పలుకుతోంది. ఇక్కడి వ్యాపారులు ఒక్కటై రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. నాలుగైదు లాట్లను రూ.4 వేలు పెడుతున్నారు. మిగిలిన సరకును రూ.1,500-2 వేల లోపు ధరకు తీసుకుంటున్నారు. 1.60 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తే 120 ప్యాకెట్ల దిగుబడి వచ్చిందని రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టా.. విపణిలో ధర చూస్తే క్వింటా రూ.2 వేలకు మించి ధర రావడం లేదు.' -రాంభూపాల్, కౌలురైతు, పంచలింగాల

తగ్గిన ఉల్లి దిగుబడి - ధరలు పైపైకి - అయినా రైతన్నకు తప్పని నష్టాలు - Onion Crop Damage in Kurnool

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.